ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి చేదు వార్త - మరింత ఆలస్యంగా సందీప్‌ రెడ్డి వంగా 'స్పిరిట్‌'! కారణం ఏంటంటే..
'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. రాజమౌళి 'బాహుబలి' నుంచి మొదలు ప్రభాస్‌ నటించిన.. నటిస్తున్నా.. నటించబోయే ప్రాజెక్ట్స్‌ చూస్తే మాత్రం అంతా అవాక్క్‌ అయిపోవాల్సిందే. అంతగా తన మార్కెట్‌ పెంచుకున్నాడు ఈ 'డార్లింగ్‌'. సలార్‌తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ప్రభాస్‌ ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ 'కల్కి 2898 ఏడి' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్‌-మారుతి కాంబోలో తెరకెకుతున్న 'ది రాజసాబ్‌' ఉంది. అనంతరం 'అర్జున్‌ రెడ్డి', 'యానిమల్‌' డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగతో(Sandeep Reddy Vanga) జతకట్టబోతున్నాడు. ఇప్పటికే 'స్పిరిట్‌' (Spirit) పేరుతో మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'ఓం భీమ్‌ బుష్‌' కలెక్షన్స్‌ - ఫస్ట్‌డే అన్ని కోట్లా? ఊహించిన దానికంటే ఎక్కువే రాబట్టిందిగా!
టాలెంటెడ్‌ హీరో శ్రీ విష్ణు సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తనదైన నటనతో ఇండస్ట్రలో స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. రోటిన్‌కు భిన్నంగా స్క్రిప్ట్స్‌ ఎంపిక చేసుకుంటూ ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ని అలరిస్తు వస్తున్నాడు. గ్యాప్‌ ఎక్కువైన ఓ సరికొత్త కథతో ప్రేక్షకులను ముందుకు వచ్చి హిట్‌ కొడుతున్నాడు. గతేడాది 'బ్రోచేవారెవరురా' మూవీతో హిట్‌ కొట్టిన శ్రీవిష్ణు అదే జోష్‌తో ఈసారి ఓం భీమ్ బుష్' అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చాడు. 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం తెరెక్కిన ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సంస్థతో కలిసి సురేష్ బలుసు నిర్మించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఇళయరాజా బయోపిక్ నుంచి క్రేజీ న్యూస్- స్క్రీన్ ప్లే అందించబోతున్న కమల్ హాసన్
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌ తెరకెక్కబోతోంది. సంగీత దిగ్గజం జీవిత ప్రయాణంతో పాటు ఆయన ఎదగుదలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రలో ధనుష్ కనిపించబోతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు ధనుష్ తో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాను తెరకెక్కించారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ - ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్న గ్లోబల్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డేకు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో దీనిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇక తన ఫ్యాన్స్‌ను సంతోషపెట్టడం కోసం చరణ్ కూడా ఏకంగా మూడు అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘ఆర్‌సీ 16’ పూజా కార్యక్రమాన్ని చేసిన ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు ఈ హీరో. ఇప్పుడు మరికొన్ని అప్డేట్స్ ఇచ్చి ట్రిపుల్ ధమాకాకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా తన మార్కెట్ పెరగడంతో మార్చి 27న రామ్ చరణ్ పుట్టిరోజును కేవలం ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'దేవ‌ర‌', 'పుష్ప 2', 'క‌ల్కి' కోసం వెయిటింగ్ : మయాంక్ అగర్వాల్
ఐపీఎల్ సీజ‌న్ కావ‌డంతో ఆట‌గాళ్లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. వాళ్ల‌పై స్పెష‌ల్ వీడియోలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా స‌న్ రైజ‌ర్స్ ఆట‌గాడు మ‌యాంక్ మాట్లాడుతూ.. 'పుష్ప' సినిమా చూశాను.. ఇంకా 'పుష్ప 2', 'దేవ‌ర‌', 'క‌ల్కీ' సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను. అవి కూడా చూడాలి అంటూ త‌న మ‌న‌సులో మాట బ‌య‌టపెట్టారు మ‌యాంక్. ఇక ఈ వీడియో ట్విట్ట‌ర్ లో తెగ వైర‌ల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)