తిరుపతిలో అభిమానుల ఫోన్లు లాగేసుకున్న హీరో విశ్వక్‌ సేన్‌ - షాకైన ఫ్యాన్స్‌
యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అతడి లేటెస్ట్‌ మూవీ గామి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 22 కోట్లకు పైగా వసూళ్లు చేసి లాభాల్లోకి వెళ్లింది. ఇంత భారీ విజయం సాధించిన నేపథ్యంలో గామి టీం బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌ చాందిని చౌదరి, డైరెక్టర్‌తో పాటు ఇతరు మూవీ టీం సభ్యులు తిరుపతి వెళ్లారు. నేడు ఉదయం విఐపీ దర్శనం ద్వారా స్వామివారిని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం నుంచి బయటకు వస్తున్న హీరో విశ్వక్‌ సేన్‌, హీరోయిన్‌ చాందని చౌదరిని చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ఆసక్తిచూపించారు. వారితో సెల్ఫీ, ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్‌ అంతా ఎగబడ్డారు. ఈ క్రమంలో హీరో విశ్వక్‌ సేన్‌ ఫ్యాన్స్‌ సెల్‌ఫోన్లు లాక్కుని వారిని ఆటపట్టించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అప్పుడు తిట్టింది, ఇప్పుడు చూస్తానంటుంది - ‘యానిమల్’ మూవీ చూస్తానంటోన్న అమీర్ ఖాన్ భార్య
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమాపై ఇంకా కాంట్రవర్సీలు ముగిసిపోలేదనే అనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావుకు, సందీప్‌కు మధ్య పరోక్ష వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో తాను అసలు ‘యానిమల్’ సినిమా చూడలేదని కిరణ్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చింది. కానీ తాజాగా తనకు ‘యానిమల్’ చూడాలని ఉందంటూ మరొక స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కిరణ్ రావు  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగాతో పరోక్ష వాగ్వాదాలు ముగిసిన తర్వాత ఆమె ఇప్పుడు అలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడమేంటి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పదేళ్లకు కుదిరింది - సల్మాన్‌తో మురుగదాస్ సినిమా!
'టైగర్ 3'తో 2023లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ థియేటర్లలో సందడి చేశారు. ఆ సినిమా తర్వాత ఎవరి దర్శకత్వంలో సల్మాన్ సినిమా చేస్తారు? అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. దక్షిణాది దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాతో ఆయన ఓ సినిమా చేయనున్నారు. వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రంజాన్ మాసం మొదలైన సందర్భంగా ఈ రోజు సినిమా వివరాల్ని వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అంబానీ అంకుల్ మీరూ మా మూవీ చూడాలి - అనంత్ ప్రి-వెడ్డింగ్ వేడుకలో ‘ఓం భీమ్ బుష్’ టీమ్ అల్లరి
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. 'బ్రోచేవారెవరూ' తర్వాత వీరు ముగ్గురూ కలిసి నవ్వించబోతున్న చిత్రమిది. 'నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్' అనేది ట్యాగ్ లైన్. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన  ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఆకట్టుకున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


గుడ్‌న్యూస్‌.. వంటలక్క వచ్చేస్తోంది! - ఆ రోజు నుంచే 'కార్తీక దీపం 2' సీరియల్‌ టెలికాస్ట్
మళ్లీ బుల్లితెరపై త్వరలో వంటలక్క సందడి కనిపించబోతుంది. సూపర్‌ హిట్‌ సీరియల్‌ 'కార్తీక దీపం' మళ్లీ వస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక దీపం 2 పేరుతో సీక్వెల్‌ను ప్రకటించారు. దీంతో బుల్లితెర ఆడియన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తూ టీవీకి ఎప్పుడెప్పుడు అతుక్కుపోదామా? అని బుల్లితెర ఆడియన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. వారందరిని ఫుల్‌ ఖుష్‌ చేసే ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 'కార్తీక దీపం' ప్రసారంకు రెడీ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)