మరో డెబ్యూ డైరెక్టర్​కి నాగార్జున గ్రీన్ సిగ్నల్ - కొత్త సినిమాపై ఆసక్తికర అప్డేట్!
సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలన్నా, సినిమా కోసం ప్రయోగాలు చేయాలన్నా కొందరు హీరోలు మాత్రమే ఇందుకు ఆసక్తి చూపుతుంటారు. మన టాలీవుడ్ లో చూసుకుంటే కింగ్ నాగార్జున ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. శివ, మాస్, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలతో సరికొత్త ప్రయోగాలు కూడా చేశారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, త్వరలోనే నాగార్జున మరో కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ ఆ డెబ్యూ డైరెక్టర్ ఎవరు? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసిన 'టైగర్ 3' - ఆ సీన్స్​తో కలిపి స్ట్రీమింగ్, ఎక్కడంటే?
భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టైగర్ 3’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. సినిమాకి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. టైగర్ యూనివర్స్ లో వచ్చిన గత చిత్రాల రేంజ్ లో 'టైగర్ 3' లేకపోవడంతో భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. సల్మాన్ ఖాన్ క్రేజ్ తో మొదటి రెండు రోజుల్లో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో అన్ని భాషల్లో కలిపి రూ.286 కోట్ల షేర్, రూ.335 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమాకి రూ.300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. దాంతో నిర్మాతలకు 'టైగర్ 3' రూ.14 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. జనవరి 7 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో 'టైగర్ 3 ' స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా సల్మాన్ ఫ్యాన్స్​కి, టైగర్ సిరీస్ ఇష్టపడే ఆడియన్స్​కి మేకర్స్ మరో సర్​ఫ్రైజ్ ఇచ్చారు. 'టైగర్ 3' కి సంబంధించి సెన్సార్ బోర్డు కట్ చేసిన డిలీట్ చేసిన సన్నివేశాలతో కలిపి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అజయ్ దేవగన్ కొత్త సినిమా ఓపెనింగ్​లో 'మిస్టర్ బచ్చన్ టీమ్' - రవితేజ, హరీష్ శంకర్ వెళ్లడం వెనక రీజన్ అదే!
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇద్దరూ ముంబైలో సందడి చేశారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ కొత్త సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో ఈ టాలీవుడ్ స్టార్స్ మెరవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వీరితోపాటు పీపుల్ మీడియా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవితేజ, హరీష్ శంకర్ అజయ్ దేవగన్ కొత్త సినిమా ఓపెనింగ్ కి వెళ్లడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న 'రైడ్ 2' సినిమా ఓపెనింగ్ కార్యక్రమం శనివారం ముంబైలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మూవీ టీం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బాబు కోసం ఇంటర్నేషనల్ బ్యూటీని సెట్ చేస్తున్న జక్కన్న.. ప్లాన్ మాములుగా లేదుగా!
గత ఏడాది 'RRR' సినిమాతో పాన్ ఇండియా హిట్​ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటిసారి వీరి కాంబినేషన్​లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి. 'బాహుబలి', 'RRR' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్​పై కన్నెశాడు. ఈ క్రమంలోనే సినిమా కోసం ఏది ప్లాన్ చేసినా అది ఇంటర్నేషనల్ రేంజ్​లో ఉండేలా చూసుకుంటున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మీరే పెద్ద అబద్దం, జావేద్ అక్తర్ విమర్శలపై ‘యానిమల్‘ టీమ్ స్ట్రాంగ్ కౌంటర్
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. గత డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.900 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో, అదే స్థాయిలో విమర్శలపాలైంది. ఆర్జీవీ లాంటి దర్శకులు సినిమా చాలా బాగుందని ప్రశంసించినా, కొందరు ప్రముఖులు సమాజంలో స్త్రీలను చిన్నచూపు చూసేలా ఉందని విమర్శించారు. ఈ సినిమాపై పార్లమెంట్ లోనూ చర్చజరిగింది. ఇలాంటి సినిమాలు చాలా ప్రమాదకరమని సభ్యులు అభిప్రాయపడ్డారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)