4
రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. మాల్వీ మల్హోత్రా, మన్నార్‌ చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్‌ నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక ఎంటర్ టైనర్ గా ఈ మూవీ రూపొందుతోంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘తిరగబడరా సామీ’ టీజర్ సోమవారం సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ టీజర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టీజర్ లాంచ్ చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఫస్ట్ లుక్ కాదు, డైరెక్ట్ ఎటాక్ - అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన ఓజీ టీమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ ఇచ్చింది ‘OG’ టీమ్. రొటీన్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఎందుకని అనుకున్నారో ఏమో.. ఏకంగా స్నీక్-పీక్‌తోనే థ్రిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ‘‘ఫస్ట్ లుక్ లేదు. ఆకలితో ఉన్న చిరుత కోసం సెప్టెంబరు 2 వరకు వేచి చూడండి’’ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


దర్శకుడిగా దళపతి విజయ్ కొడుకు - లైకా ప్రొడక్షన్స్‌తో మొదటి సినిమా ప్రకటన!
తమిళ టాప్ హీరో దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారు? టెక్నికల్ క్రూ సంగతేంటి? అనే విషయాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలో వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా రానున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సమంత ఫేవరేట్ హీరోని నేనే - ఆమె చీటింగ్ కూడా బాగా చేస్తుంది: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. 'నిన్ను కోరి' మూవీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే విజయ్, సమంత, శివ నిర్వాణ వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తో కలిసి 'ఖుషి' మూవీ టీంని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్లతో పాటు దర్శకుడు శివ నిర్వాణ పాల్గొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


శేఖర్ మాస్టర్‌కు సారి చెప్పిన శ్రీలీల, అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది శ్రీలీల. ఆమె నటించిన చిత్రాలు వరుసగా హిట్ కావడంతో మంచి క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం తెలుగులో సుమారు డజన్ సినిమాలు చేస్తోంది.  ఇక ఈ ముద్దుగుమ్మ అంటేనే డ్యాన్స్ కు కేరాఫ్ అన్నట్లుగా మారిపోయింది. అందం, అభినయంతో పాటు అదిరిపోయే స్టెప్పులు వేయడంలో తనకు తానే సాటి. హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే హీరోలను తలదన్నేలా దుమ్మురేపుతోంది. రీసెంట్ గా రవితేజతో కలిసి నటించిన ‘ధమాకా’ చిత్రంలో ఆమె డ్యాన్స్ కు ప్రేక్షకులు మైమరచిపోయారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ 15న రామ్ తో కలిసి నటించిన ‘స్కంద’ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)