సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ పై రియాక్టైన సమంత కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత కుంగిపోయి చనిపోతానని అనుకున్నానని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది సమంత.  అభిమానుల నుంచి ఎదురైన విమర్శలు, ట్రోల్స్ నుంచి తన మానసిక పరిస్థితి గురించి కూడా ఓపెన్ అయింది. తనను తాను బలహీనురాలిగా భావించానని, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పరిస్థితులను ఎదుర్కొనే శక్తి తనకు లేదనుకున్నాని అంది. ఆశ్చర్యంగా తాను శక్తివంతురాలిగా ఉన్నానని, ఇప్పటి తన పరిస్థితి చూసి తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. "మన రోజు బాలేకపోతే.. దాన్ని  అర్థం చేసుకుని, అంగీకరించి ముందుకు వెళ్లాలని చెప్పుకొచ్చింది.   కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు, అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని వాపోయింది. తాను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని లేదు..కానీ..మీకు నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పడానికి ఓ విధానం ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా సిద్దార్థ్ పెట్టిన ట్వీట్ చూస్తుంటే సామ్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడంటున్నారు నెటిజన్లు. 






సిద్దార్థ ట్వీట్ లో ఏముందంటే.. ‘నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ తనంతట తనే జరగదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానండి’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సమంతాని ఉద్దేశించే సిద్దార్థ అలా అన్నాడని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి దీనిపై సిద్ధార్థ  ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read:   ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
Also Read: 'RRR' అప్‌డేట్.. భీమ్ వచ్చేశాడు


Also Read:  బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ గురించి ఈ విషయాలు తెలుసా..
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్


Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?


Also Read:  ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్