సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. టాక్ సంగతి పక్కన పెడితే కలెక్షన్స్ పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. 

 

రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.103 కోట్ల గ్రాస్ ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

దీనికోసం భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయిన నాలుగు వారాల తరువాత సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే మే 12న విడుదలైన ఈ సినిమా జూన్ రెండో వారంలో ఓటీటీలోకి వస్తుందన్నమాట. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.