ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించిన నాగబాబు.. తేజు కోలుకుంటున్నాడని, త్వరలోనే మన ముందుకు వస్తారని అన్నారు. సాయి తేజ్ హాస్పిటల్ లో ఉన్నప్పటికీ.. మెగాహీరోల సపోర్ట్ తో ఆయన నటించిన 'రిపబ్లిక్' సినిమాను శుక్రవారం నాడు విడుదల చేశారు. 


Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?


అయితే సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టారు. ఇది అభిమానుల్లో కాస్త నిరాశను నింపింది. సెలెబ్రిటీల కోసం ఈ సినిమా స్పెషల్ షో వేయగా.. వారంతా సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు చేశారు. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. దీంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా స్టోరీ, సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన అభిమానులు క్లైమాక్స్ ఎపిసోడ్ ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. 


ఈ సినిమాలో హీరో కలెక్టర్ పాత్రలో కనిపించరు. సిస్టం లోనే ఉంటూ సిస్టంను ప్రశ్నించే పవర్ పాత్రలో సాయి తేజ్ అద్భుత నటన కనబరిచారు. కానీ పతాక సన్నివేశాల్లో హీరో పాత్రను చంపేయడం నిరాశకు గురి చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఓ పక్క తేజు యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే.. ఆన్ స్క్రీన్ పై అతడు చనిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. అభిమానుల ఫీలింగ్ ను పక్కన పెడితే.. నిజాయితీగా ఉండే ఏ ఒక్కడినే సమాజం బతకనివ్వదు అని దర్శకుడు ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు. 


Also Read:ఆ రోజు నాకు వైద్యం చేసింది అల్లు రామలింగయ్యే.. రాజమండ్రిలో చిరు చిట్‌చాట్


Also Read: ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు


Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు


Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి