మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేస్తునట్టు ప్రకటించారు. మార్చి 25న రామారావుగా రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.





'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రవితేజ సరసన 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నవంబర్ లో మారేడుమిల్లి ఫారెస్టులో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించారు. పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.


'పడి పడి లేచె మనసు'తో మంచి అభిరుచి కల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి, ఆ తర్వాత రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 'విరాట పర్వం' ప్రారంభించారు. ఆ సినిమా చిత్రీకరణ కూడా చివరి దశలో ఉంది. ఆ సినిమా తర్వాత 'రామారావు ఆన్ డ్యూటీ' పారంభించారు.


Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన స‌మ‌స్య‌... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి