తన తప్పు ఏమీ లేనప్పటికీ... తనను టార్గెట్ చేస్తూ వస్తున్న ట్రోల్స్, మీమ్స్ గురించి స్టార్ట్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) స్పందించారు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవిడ ఒక పోస్ట్ చేశారు. ఆన్ లైన్ వేదికగా ఎదురవుతున్న వ్యతిరేకతపై మౌనం వీడారు. ట్రోల్స్ నిరుత్సాహ పరిచే విధంగా ఉన్నాయని, గుండె బద్దలు అయ్యేలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు (Rashmika Breaks Silence).
 
నా గురించి మాత్రమే చెబుతున్నా! - రష్మిక
Rashmika Mandanna Pens Heartbreaking Note : ''గత కొన్ని రోజులు, వారాలు, నెలలు లేదంటే కొన్నేళ్లుగా... కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటి గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను. నా గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఈ పని కొన్నేళ్ల క్రితమే చేయాల్సింది'' అంటూ రష్మిక నెగిటివిటీ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు.


కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి...
కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తనపై కొందరు విషం చిమ్ముతున్నారని, తనను ద్వేషిస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోల్స్ చేసేవాళ్ళు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళకు తానొక పంచింగ్ బ్యాగ్ కింద మారినట్టు ఆవిడ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడాలని తాను ఆశించడం లేదని, నటిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విమర్శలు వస్తాయనేది తనకు తెలుసని, దాని అర్థం ద్వేషించమని కాదని రష్మిక స్పష్టం చేశారు. ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం ప్రతి రోజూ తాను కష్టపడుతున్నాని ఆవిడ వివరించారు.


నేను చెప్పని విషయాలకు...
Rashmika Slams Trolls : ''ముఖ్యంగా నేను చెప్పని విషయాలకు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నన్ను ఎగతాళి చేస్తున్నారు. టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. వాటిని చూసినప్పుడు గుండె బద్దలవుతోంది. నిరుత్సాహానికి గురవుతాం. కొన్ని ఇంటర్వ్యూలలో నేను చెప్పిన విషయాలు నాకు వ్యతిరేకంగా మారాయి. చిత్రసీమలో, సినిమా ఇండస్ట్రీ బయట నా రిలేషన్షిప్స్‌కు హాని కలిగించే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు'' అని రష్మిక పేర్కొన్నారు. తనను మెరుగు పరుచుకునేలా వచ్చే సహేతుకమైన విమర్శలను తాను స్వాగతిస్తానని ఆవిడ తెలిపారు. 


వదిలేస్తే వరస్ట్ అవుతోంది!
చాలా రోజులుగా తాను విమర్శలను విస్మరిస్తూ వస్తున్నానని... అయితే రోజు రోజుకూ వరస్ట్ అవుతోందని రష్మిక వివరించారు. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడటం వల్ల ఎవరిపైనా విజయం సాధించేది లేదని ఆవిడ వ్యాఖ్యానించారు. ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమ, అభిమానం ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తోందని ఆవిడ చెప్పారు.


Also Read : నేను ఒక్కరోజు టైమ్ తీసుకుంటా! కానీ, 'యశోద'కు... : సమంత ఇంటర్వ్యూ



సినిమాలకు వస్తే... తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో ఆవిడ నటించనున్నారు. హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే 'యానిమల్'లో కూడా ఆవిడ నటించనున్నారు. ఈ ఏడాది 'గుడ్ బై'తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక... సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా 'మిషన్ మజ్ను'లో నటించనున్నారు.