కన్నడ బ్యూటీ రష్మిక 'ఛలో' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉండడం, యూత్ లో రష్మికకి డిమాండ్ పెరగడంతో దర్శకనిర్మాతలు ఆమెని హీరోయిన్ గా ఎన్నుకోవడం మొదలుపెట్టారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఆడిపాడింది ఈ బ్యూటీ. 


రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియా సినిమా 'పుష్ప'లో హీరోయిన్ గా నటించింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది రష్మిక. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ బ్యూటీ తెగ హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ వరకు ఎదురుచూసి రిజల్ట్ ను బట్టి రెమ్యునరేషన్ పెంచాలనుకుంది. 'పుష్ప' పార్ట్ 1కి రష్మికకు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. 


ఇప్పుడు మరో కోటి రూపాయలు పెంచి రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ఆమెకి ఉన్న ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. 'పుష్ప' పార్ట్ 2కి రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతుంది రష్మిక. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల పరంగా చాలా బిజీగా ఉంటోంది. z


తెలుగులో శర్వానంద్ సరసన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో నటిస్తోంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అలానే బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది రష్మిక. 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న 'మిషన్ మజ్ను' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే రష్మిక రేంజ్ మరింత పెరగడం ఖాయం. 


Also Read: హీరోగా ఎన్టీఆర్ బావమరిది.. డైరెక్టర్ ఎవరంటే..?


Also Read: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ..


Also Read: 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ రోల్ ఇదే.. రివీల్ చేసిన నిర్మాత..


Also Read: సంక్రాంతి రేసులో డబ్బింగ్ సినిమాలు.. అజిత్ Vs విశాల్..


Also Read: ఇది చాలా టఫ్ టైం.. 'రాధేశ్యామ్' దర్శకుడు హింట్ ఇస్తున్నాడా..?


Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి