ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ 'రాధేశ్యామ్' అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే 'ఆర్ఆర్ఆర్'లానే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన చిత్రబృందం అందులో నిజం లేదని.. 'రాధేశ్యామ్' సినిమా చెప్పినట్లుగానే సంక్రాంతికి విడుదలవుతుందని ప్రకటించింది. 


అయినప్పటికీ.. 'రాధేశ్యామ్' రిలీజ్ పై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రోజురోజుకి కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండడం.. నార్త్ లో చాలా స్టేట్స్ లో కర్ఫ్యూలు విధించడం వంటి కారణాలతో సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 


'ఇది చాలా టఫ్ టైం. హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా.. మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి. టీమ్ రాధేశ్యామ్' అంటూ పోస్ట్ పెట్టారు దర్శకుడు రాధాకృష్ణ. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ ట్వీట్ కి అర్ధమేంటని ప్రశ్నిస్తున్నారు. 


ఇన్‌డైరెక్ట్ గా సినిమా పోస్ట్ పోన్ అవుతుందని హింట్ ఇస్తున్నారా..? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'అలాంటిదేమైనా ఉంటే డైరెక్ట్ గా అఫీషియల్ గా చెప్తామని' రిప్లై ఇచ్చారు రాధాకృష్ణ. ప్రస్తుతానికైతే రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. కానీ దర్శకుడి ట్వీట్ చూసిన ఫ్యాన్స్ లో పలు అనుమానాలు కలుగుతున్నాయి.  






Also Read: ఇప్పుడు నోళ్లు మూసుకుంటే ఇంకెప్పటికీ తెరవలేరు.. వర్మ ఫైర్..


Also Read: రాజమౌళితో కరణ్ జోహార్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?


Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..


Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?


Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..



 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి