'బాహుబలి' సినిమాతో రాజమౌళి రేంజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మన జక్కన్న రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వెనుక కూడా కరణ్ జోహార్ ఉన్నారు. అయితే చాలా కాలంగా దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు కరణ్ జోహార్. ఆ సినిమాకి సోలో నిర్మాతగా తన పేరు ఉండాలనేది కరణ్ ఆలోచన. ఈ విషయంలో రాజమౌళితో ఓ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం. 


కరణ్ జోహార్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో ఓ బాలీవుడ్ సినిమా రాబోతుందని సమాచారం. ఇదొక ప్రయోగాత్మక సినిమా అని తెలుస్తోంది. ఇదివరకు రాజమౌళి 'ఈగ', 'మర్యాద రామన్న' వంటి సినిమాలు తీశారు. ఇప్పుడు అదే కోవలో బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తారట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇందులో అందరూ కొత్తవాళ్లే ఉంటారని తెలుస్తోంది. చిన్న బడ్జెట్ లో తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. 


నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా ఉన్తున్ది సమాచారం. ఈ సినిమా మొదలుపెట్టడానికి ముందు కాస్త గ్యాప్ దొరికితే కరణ్ జోహార్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. 


లేదంటే మహేష్ బాబు సినిమా పూర్తయ్యాక బాలీవుడ్ సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కరణ్ జోహార్ తో మాత్రం రాజమౌళితో డీల్ చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి!


Also Read: బాధలో దీప్తి సునయన.. చిల్ అవుతోన్న సిరి, షణ్ముఖ్..


Also Read: 'నాయట్టు' రీమేక్.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?


Also Read: రోజుకి కోటి రూపాయలా..? నిర్మాతకు షాకిచ్చిన విజయ్ సేతుపతి..