ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'ప్రాజెక్ట్ K'. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మూడు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 'బ్రహ్మాస్త్ర' సినిమా కథ, ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' కథ ఒకలానే ఉందని సమాచారం. 

 

కొన్ని దశాబ్దాల క్రితం హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒక ఆయుధాన్ని దాచి ఉంచుతారు. ఆ ఆయుధం కోసం జరిగే పోరాటమే 'బ్రహ్మాస్త్ర'. ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' సినిమా కూడా ఇలానే ఉంటుందని సమాచారం. హిమాలయాలు, ఒక పవర్ ఫుల్ వెపన్ కాన్సెప్ట్ చుట్టూ 'ప్రాజెక్ట్ K' కూడా నడుస్తుంది. ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ సగం పూర్తయింది. ఇప్పుడు వాళ్లు కథ మార్చే ఛాన్స్ లేదు. ప్రస్తుతం కథలో మార్పుల కోసం చర్చలు జరుగుతున్నాయి. 

 

వీలైతే 'బ్రహ్మాస్త్ర' సినిమా టీమ్ తో కూర్చొని సిమిలారిటీస్ ను చర్చించుకొని 'ప్రాజెక్ట్ K'లో మార్పులు చేయాలనే ఆలోచలో ఉన్నారు. కొన్ని పోలికలు ఉంటే మార్చుకోవడానికి పెద్దగా సమస్య ఉండదు కానీ కథకి మూలం ఒకేలా ఉంటే మాత్రం పూర్తి స్క్రిప్ట్ ను మార్చుకోవాల్సి ఉంటుంది.