దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. ముందుగా జూలై 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కాస్త ముందుగా జూన్ 17న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 


దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ముందుగా ఈ సినిమా నుంచి 'నగాదారిలో' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 5న ట్రైలర్ రాబోతుందని ఓ పోస్టర్ ను వదిలింది చిత్రబృందం. ఇందులో రానా ముఖం చూపించలేదు కానీ.. సాయిపల్లవి అతడిని గట్టిగా హత్తుకున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఈ సినిమాలో మావోయిస్టు పాత్రలో రానా కనిపించనున్నారు. ఆయన్ను ప్రేమించే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించారు. సాయుధ పోరాటంతో పాటు వీళ్ళిద్దరి మధ్య ప్రేమకథకూ సినిమాలో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.


Also Read: 'విక్రమ్' సినిమా ఓటీటీ-శాటిలైట్ రైట్స్ ఎంతంటే?


Also Read: హాలీవుడ్ లో 'ఆదిపురుష్' - ప్రభాస్ రేంజ్ ఇదీ!