విజయ్ సేతుపతి, సమంత, నయన తార నటించిన ‘కాతువాక్కుల రెండు కాదల్‌’(కణ్మని రాంబో ఖతీజా) సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్, ఆ సినిమా దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా వెరైటీగా వెల్లడించారు. అయితే, ఈ చిత్రాన్ని తెలుగులో ‘కణ్మని రాంబో ఖతీజా’ టైటిల్‌తో కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఓటీటీలో తమిళంతోపాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదల చేస్తారా? లేదా అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. 


ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించే అమాయక ప్రేమికుడిగా నటిస్తున్నాడు. రేఖపల్లి ఆనందరాజు మదనగోపాల భోగేశ్వరుడు (విజయ్ సేతుపతి) అలియాస్ రాంబోకు తను దురదృష్టవంతుడిని అని నమ్మకం. తను పుట్టినరోజే తండ్రి చనిపోవడం, తల్లి మంచానికే పరిమితం కావటంతో రాంబో ఊరికి దూరంగా ఉంటాడు. కన్మణి(నయనతార), కతీజా(సమంత) రాకతో తన జీవితంలో సంతోషం కనిపిస్తుంది. తనకు తెలియకుండానే ఇద్దరిని ప్రేమిస్తాడు రాంబో. అయితే తను చేస్తోంది తప్పు అనే అపరాధభావన కలుగుతుంది. అప్పుడు రాంబో ఏం చేశాడు? ఇద్దరిలో ఎవరిని ఎంచుకున్నాడు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


Also Read: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!


ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. కాసేపు కడుపుబ్బా నవ్వుకోవాలంటే ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు. ‘కాతువాక్కుల రెండు కాదల్‌’ (Kaathuvaakula Rendu Kaadhal) చిత్రం మే 27 నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. ‘కణ్మని రాంబో ఖతీజా’ (Kanmani Rambo Khatija) చిత్రం కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశాలున్నాయి. దీనిపై స్పష్టత రావల్సి ఉంది. 


Also Read: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు