బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ది ఫ్యామిలీ మెన్'(The Family Man) వెబ్ సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి బ్లాక్ బాస్టర్ అయ్యాయి. మూడో సీజన్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో 'ఫ్యామిలీ మెన్ సీజన్ 3' కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇటీవల ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణికి ఫ్యామిలీ మెన్ సీజన్ 3 ఎప్పుడు? అనే ప్రశ్న ఎదురవగా, ఆమె బదులిస్తూ.." రాజ్ అండ్ డీకే సార్ నిన్నే ఫ్యామిలీ మెన్ సీజన్ 3 గురించి నాకు చెప్పారు. త్వరలోనే సీజన్ 3 రాబోతుందని. కాబట్టి దానికోసం వేచి ఉండండి" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.


ఆ తర్వాత ప్రియమణి మాట్లాడుతూ.." రాజ్ అండ్ డీకే సార్ 'ఫర్జీ'(Ferzi) సిరీస్ కోసం పనిచేస్తున్నప్పుడు నేను వారిని కలిశాను. అప్పటినుంచి సీజన్ 3 ఎప్పుడు వస్తుందని అడుగుతూనే ఉన్నాను. దానికి వాళ్లు త్వరలో.. త్వరలో.. త్వరలో.  వస్తుందని చెబుతూ వస్తున్నారు. కచ్చితంగా చెప్పాలంటే సీజన్ 3 షూటింగ్ ని వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నాం" అంటూ చెప్పుకొచ్చింది. ప్రియమణి చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెడితే అదే ఎడాది చివర్లో 'ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3' రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


ప్రస్తుతం ప్రియమణి 'జవాన్' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు. ప్రియమణి మరో ప్రధాన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఆమెతో పాటు సానియా మల్హోత్రా, ఆలియా ఖురేషి, లేహర్ ఖాన్ తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.


'పఠాన్' తర్వాత ఇదే ఏడాది 'జవాన్' తో షారుక్ కి మరో వెయ్యి కోట్ల సినిమా పడడంతో షారుఖ్ ఫ్యాన్స్ డైరెక్టర్ అట్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటు సెలబ్రిటీస్ కూడా జవాన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇండియా వైడ్ గా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.


మరోవైపు 'జవాన్' తర్వాత ప్రియమణి మరో బాలీవుడ్ మూవీ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అజయ్ దేవగన్ నటిస్తున్న 'మైదాన్' సినిమాలో ప్రియమణి నటిస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది." అజయ్ సార్ మైదాన్ లో ఓ కీలక పాత్ర చేస్తున్నా. రీసెంట్ గా నా పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశా. ఈ సినిమా షూటింగ్ అనుభవాన్ని జీవితంలో మర్చిపోలేను. అజయ్, అమిత్ సార్ లతో కలిసి పని చేయడం నాకు చాలా బాగా నచ్చింది" అంటూ ప్రియమణి తెలిపారు.


Also Read : అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్





Join Us on Telegram: https://t.me/abpdesamofficial