దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ 'దఢక్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. పరువు హత్యల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ కి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమా తరువాత జాన్వీ నుంచి రెండు సినిమాలొచ్చాయి కానీ అవి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. పాండమిక్ సమయంలో ఆమె నటించిన 'గుంజన్ సక్సేనా', 'రూహీ' వంటి సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చాయి. 


తాజాగా ఆమె నటిస్తోన్న మరో కొత్త సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. తమిళంలో నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన 'కొలమావు కోకిల' సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. 


జూలై 29 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. సినిమా పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఒక పోస్టర్ లో జాన్వీ కపూర్ గన్ పట్టుకొని కనిపించింది. మరో పోస్టర్ లో భయంతో లంచ్ బాక్స్ వెనుక దాక్కున్నట్లు కనిపించింది. ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ తెరకెక్కించారు. ఈ సినిమాలో దీపక్‌ డోబ్రియాల్‌, మితా వశిష్ట్‌, నీరజ్ సూద్‌, సుశాంత్‌ సింగ్‌ నటించారు. ఈ సినిమాను సన్‌డియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి.


Also Read: 'నీకోసం' - శ్రీరామచంద్ర కొత్త సాంగ్ విన్నారా?


Also Read: బోయపాటితో రామ్ సినిమా - ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్