వసూళ్ళతో పాటు స్టార్స్ చేస్తున్న యాడ్స్‌ను బట్టి స్టార్‌డమ్ అంచనా వేస్తున్న రోజులు ఇవి. ఆడియన్స్‌లో, పబ్లిక్ మార్కెట్‌లో స్టార్స్‌కు ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి యాడ్స్ ఉపయోగపడుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఉత్తరాదిలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆ మాటకు వస్తే... జపాన్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్'లో నటనతో పాటు జపనీస్ స్పీచ్‌తో అక్కడి ప్రజలను ఆయన ఆకట్టుకున్నారు. 


ఎన్టీఆర్ (NTR) క్రేజ్ చూసి ఆయనతో యాడ్స్ చేయడానికి, తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు అమితమైన ఆసక్తి  చూపిస్తున్నాయి. ఆచితూచి యాడ్స్ ఎంపిక చేసుకుంటున్న ఎన్టీఆర్... తాజాగా ఓ యాడ్ చేశారు. అది ఏమిటంటే...
 
ఇంటికి మీట్...
ఎన్టీఆర్ యాడ్!
ఇప్పుడు మీట్ కొనడానికి షాప్స్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్... మీకు కావల్సినది ఏదైనా ఇంటికి డెలివరీ చేయడానికి ఆన్‌లైన్ యాప్స్ వచ్చాయి. అందులో 'లీషియస్' (Licious) ఒకటి. దాని కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారు.
 
'జరగబోయే సంచనలం ఊహించగలరా?' అంటూ లీషియస్ సంస్థ తొలుత ఒక పోస్ట్ చేసింది. ఆ తర్వాత ''బాక్ బస్టర్ ఎంట్రీ వస్తుంది. స్పెషల్ ఎంట్రీ త్వరలో ఉంటుంది'' అని మరో పోస్ట్ చేసింది. అందులో ఉన్నది ఎవరనేది చూపించలేదు. వెనుక నుంచి రూపం మాత్రమే కనిపించేలా పిక్ పోస్ట్ చేశారు. అయితే, అది ఎన్టీఆర్ ఈజీగా చెప్పేయవచ్చు. దాంతో లీషియస్ కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారని అర్థం అయ్యింది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. 'జై ఎన్టీఆర్', 'జై జై ఎన్టీఆర్' అంటూ లీషియస్ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు.
 
ఫుడ్ యాడ్స్ చేస్తున్న ఎన్టీఆర్?
ఇంతకు ముందు Appy Fizz డ్రింక్ కోసం ఎన్టీఆర్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికి మీట్ డెలివరీ చేసే యాప్ కోసం యాడ్ చేశారు. దాంతో ఎన్టీఆర్ ఎక్కువ ఫుడ్ యాడ్స్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. నిజం చెప్పాలంటే... ఎన్టీఆర్ ఫుడ్డీ. ఆయన వంట బాగా చేస్తారని ఫ్రెండ్స్ కొందరు చెబుతూ ఉంటారు. ఇంతకు ముందు నవరత్న ఆయిల్ కోసం కూడా ఆయన ఒక యాడ్ చేశారు.


Also Read : కృష్ణ భోజన ప్రియుడు - ఆయనకు ఇష్టమైన వంటలు ఏవో తెలుసా?
 
సినిమాలకు వస్తే... త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా (NTR 30) షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు 'దేవర' టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. దాన్ని చిత్ర బృందం ఖండించింది. ప్రస్తుతం కొరటాల శివ ఫుల్ స్వింగులో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారు. 






హీరోయిన్ ఎవరు?
ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ విషయంలో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆలియా భట్‌ను తీసుకోవాలని ప్లాన్ చేశారు. దర్శకుడు కొరటాల శివ ఆమెకు కథ కూడా వివరించారు. అయితే... ఆలియా ప్రెగ్నెంట్ కావడంతో ఆమె నటించే అవకాశాలు లేవు. ఈ మధ్య అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు కూడా వినిపించింది. ఆమె ఒక ఆప్షన్. ఎన్టీఆర్ సినిమా చేయడానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు 'మిలి' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన జాన్వీ చెప్పారు. ఆమెతో పాటు 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినబడుతోంది. చివరకు, ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.