బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ తాజాగా ట్రోలర్స్ కి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్స్ ని పెద్దగా పట్టించుకోనని చెప్పి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో భూమి ఫెడ్నేకర్  ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో విభిన్న సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది  భూమి. తొలి సినిమాలోనే చాలా లావుగా కనిపించి ప్రయోగాత్మక పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించింది. ఆ తర్వాత రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుని ప్రేక్షకులకు దగ్గరయింది.


సినిమాలతో పాటు అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. త్వరలోనే 'థాంక్యూ ఫర్ కమింగ్' అనే బోల్డ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి ఫెడ్నేకర్ సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్లింగ్స్ స్పందించింది. నటీనటులపై అసభ్యకర కామెంట్లు చేయడానికి ఓ వర్గానికి చెందిన నేటిజన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తన ఆవేదన వ్యక్తపరిచింది.


"ఈరోజుల్లో ట్రోలింగ్ అనేది సర్వసాధారణమైపోయింది. మనం ఏం చేసినా జనాలు మనల్ని ట్రోల్ చేస్తుంటారు. పండగ రోజుల్లో నేను సంప్రదాయ దుస్తులు ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినా విమర్శిస్తారు. సినిమా ప్రమోషన్ సమయంలో కనిపించకపోయినా కనిపించడం లేదని అంటారు. ఇంతకుముందు మన దుస్తుల గురించి ఇంట్లో వాళ్ళు మాత్రమే మాట్లాడేవారు. ఇప్పుడు వాటి గురించి అందరూ అడగడం మొదలుపెట్టారు. ఇది నా డ్రెస్సింగ్ పై చిన్నప్పటి నుంచి నేను విమర్శలు ఎదుర్కొన్నాను. 'పొట్టి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నావ్' అని నన్ను చాలామంది ప్రశ్నించే వాళ్ళు" అని తెలిపింది.


 " అలా నన్ను ట్రోల్ చేసే వాళ్లే మళ్ళీ సంస్కృతిని కాపాడాలని మాట్లాడతారు. కానీ మన గురించి అభిప్రాయాలు పంచుకునేందుకు అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ ఉంటారు. స్త్రీలను గౌరవించడం, వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది మన సంస్కృతిలోనే ఉంది. కానీ వాళ్లు మాట్లాడే విధానం చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఒక్కోసారి వాటిని చదవాలన్నా చాలా ధైర్యం కావాలి. అందుకే అటువంటి ట్రోల్స్ ను నేను ఏమాత్రం పట్టించుకోను" అంటూ చెప్పుకొచ్చింది భూమి పెడ్నేకర్.


దీంతో భూమి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భూమి సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సుధీర్ మిశ్రా తెరకెక్కించిన 'ఆఫ్వా'(Afwaah) మూవీలో నవాజుద్దీన్ సిద్ధిక్ తో కలిసి నటించింది  ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు 'థాంక్యూ ఫర్ కమింగ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరణ్ భులాని దర్శకత్వం వహించిన ఈ మూవీని రియా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు.


Also Read :'లియో' ట్రైలర్ చూసేందుకు వచ్చి థియేటర్ ని ధ్వంసం చేసిన ఫ్యాన్స్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial