పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నిజానికి జూలై 12నే సెట్స్ పైకి రావాల్సిన పవన్ కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా సెట్స్ లోకి నిత్యామీనన్ ఎంటర్ అయింది. 

 

ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇందులో నిత్యామీనన్ చాలా సింపుల్ గా కనిపించింది. కథ ప్రకారం సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఈ పాత్ర కనిపించేది కాసేపే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఆ పాత్రలో నిత్యామీనన్ తన బెస్ట్ ఇస్తుందని ముందే అంచనా వేయొచ్చు. 

 

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పాత్రలో కనిపించనున్నారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 


ఇక ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత భాగం పూర్తయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. 

 

ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. పవన్ గెటప్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.