అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. ఆ తరువాత 'జాతిరత్నాలు' అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాండమిక్ లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నవీన్ కామెడీ టైమింగ్, పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 

దీంతో అతడికి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగిపోయాయి. ఒక్కో సినిమాను అనౌన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. కొన్నిరోజుల క్రితమే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నవీన్ ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాపై త్రివిక్రమ్ కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఆయన భార్య పేరుని నిర్మాతగా వేశారు. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.

 

తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ పోలిశెట్టి తన డైలాగ్స్, కామెడీతో నవ్వించారు. కథ ప్రకారం ఆయన రాజు అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. రాజు గాడి పెళ్లి అదిరిపోవాలంటూ టీజర్ లో హడావిడి చేస్తూ కనిపించారు ఈ యంగ్ హీరో. సినిమాకి 'అనగనగా ఒక రాజు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. 







Also Read: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..