Malli Pelli Movie: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా లొల్లి మళ్లీ మొదలైంది. ఈ సినిమాను జూన్ 23 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. ఈ నేపథ్యం లో మూవీ స్ట్రీమింగ్ ను నిలిపి వేయాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమా నిజ జీవితాలను పోలి ఉందని, ఈ మూవీతో సమాజంలో తన ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారంటూ కోర్టు మెట్లెక్కింది రమ్య. గతంలో కూడా సినిమా విడుదల సందర్భంగా కూడా ఇలాగే సినిమాను నిలిపివేయాలంటూ డిమాండ్ చేసింది. మళ్లీ మరోసారి ఓటీటీలో కూడా మూవీను నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


‘మళ్లీ పెళ్లి’ ను ముందు నుంచీ వ్యతిరేకిస్తోన్న రమ్య రఘుపతి..


టాలీవుడ్ లో గత కొంత కాలంగా నరేష్, రమ్య రఘుపతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీరి మధ్యలోకి పవిత్ర లోకేష్ ఎంటర్ అయిన తర్వాత ఈ వ్యవహారం ఇంకా ముదిరింది. నరేష్ గత కొంత కాలంగా పవిత్రతో సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నరేష్ ఆయన భార్య రమ్య రఘుపతికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ విభేదాలు కాస్తా విడాకుల వరకూ వెళ్లింది. అయితే నరేష్ విడాకులు ఇచ్చినా రమ్య రఘుపతి మాత్ర ససేమీరా అంటోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. అయితే సేమ్ ఇదే సబ్జెక్టుతో నరేష్ ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. నరేష్ భార్య కూడా ఈ సినిమా పై ఫైర్ అయింది. ముందునుంచీ కూడా ఈ సినిమాను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికే ఈ సినిమా తీశారని ఆరోపించింది. అయినా సినిమా యథావిధిగా థియేటర్లలో విడుదలైంది.


నా పరువు తీయాలనే ఇలా చేస్తున్నారు, సినిమాను నిలిపివేయండి: రమ్య రఘుపతి


తాజాగా ‘మళ్లీ పెళ్లి’ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. జూన్ 23 నుంచి మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గతంలో ఈ మూవీను అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదల చేయాలని చూశారు. కానీ రమ్య రఘుపతి అడ్డం పడటంతో అందులో స్ట్రీమింగ్ ను నిలిపివేశారు. అయితే ఆహాలో మాత్రం స్ట్రీమింగ్ కు రెడీ అయిందీ మూవీ. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో కూడా నిలిపివేయాలంటూ రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించింది. సినిమాలో తన పాత్ర పరువు తీసేలా ఉందని పేర్కొంది.


ఈ సినిమా నిజజీవితాలకు దగ్గర పోలిక ఉందని, ఇందులో తన పాత్ర విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారని, తనకు సమాజంలో చెడ్డ పేరు తేవడం కోసమే ఇలా ఈ సినిమాను తీసారని అని కోర్టుకు విన్నవించింది రమ్య. అయితే ఈ సినిమా పూర్తిగా కల్పితమని ముందు నుంచీ చెప్పుకొస్తున్నారు నరేష్. ఇప్పుడు ‘మళ్లీ పెళ్లి’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి రమ్య పెట్టిన కేసు అడ్డంకిగా మారింది. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నరేష్, పవిత్ర లోకేష్ నటించగా జయసుధ, శరత్‌బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, మధు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. 


Also Read: బోయపాటి - రామ్ మూవీ రిలీజ్ డేట్ మారిందండోయ్ - ముందే వచ్చేస్తారట!