విడాకుల ఎపిసోడ్ ముగిశాక ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి సమంత ట్రావెలింగ్ ను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. సైక్లింగ్ చేయడం, గోవా ట్రిప్పులు తరువాత ఇప్పుడు ఆత్మీయ స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేసేస్తోంది. తాజాగా ఆమె చార్‌ధామ్ యాత్రను పూర్తి చేసినట్టు ఇన్ స్టా ఫోటో పెట్టింది. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్రావెలింగ్ లో ఉంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో మరో టాలీవుడ్ హీరో కూడా ఉన్నారు. మాస్ మహరాజ్ రవితేజ, నాగబాబు ఒకే విమానంలో కలిసి ప్రయాణం చేశారు. ఆ ఫోటోను షేర్ చేసిన నాగబాబు ‘ఇంతకన్నా ఏది మీ రోజును మరింత వినోదభరితంగా మార్చగలదు’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ తరువాత కొడుకు వరుణ్ తేజ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు. అందులో వరుణ్ వర్కవుట్స్ చేసి బాగా అలసి పోయినట్టు కనిపిస్తున్నాడు. నాగబాబు మాత్రం సూపర్ కూల్ గా నిల్చుని కొడుకునే చూస్తున్నాడు. వారి ఇన్ స్టా పోస్టులు మీరూ చూసేయండి. 





Also read: డార్లింగ్ ప్రభాస్‌కు అందాల దేవసేన శుభాకాంక్షలు.. లవ్ సింబల్ లేకుండా జాగ్రత్త


Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు


Also read: నిద్ర సరిగా పట్టడం లేదా... అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్టే


Also read: ఐఫోన్ ఆర్డర్ ఇస్తే... గిన్నెలు తోమే విమ్ సబ్బు పంపించారు, అక్కడే మరో ట్విస్టు కూడా



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి