Upasana New Car:


ఉపాసన కొత్త కారు ధర రూ.కోటిన్నరకు పైనే..


సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. వాళ్లు వేసుకునే డ్రెస్‌ల నుంచి వాళ్లు వినియోగించే కార్ల వరకూ అన్నింటిపైనా ఇంట్రెస్ట్ చూపిస్తారంతా. వాళ్లు కొత్త కార్ కొన్నా బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు రామ్‌ చరణ్ సతీమణి ఉపాసన ఓహైఎండ్ మోడల్ కార్ కొని వార్తల్లో నిలిచారు. ఆడీ కంపెనీకి చెందిన e-Tron కార్ కొన్నారు ఉపాసన. ప్రపంచమంతా అప్‌గ్రేడ్ అవుతోంది. అందుకే నేను కూడా అప్‌గ్రేడ్ అయిపోయానంటూ తన కొత్త కార్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇది ఎలక్ట్రిక్ వెహికిల్. ఈ కార్ విలువ కోటి 66 లక్షలు. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ కార్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఫీచర్లను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో షేర్ చేశారు ఉపాసన.





 


అదిరిపోయే ఫీచర్లు..


"ఇది ఆడీ కంపెనీ నుంచి వచ్చి కొత్త e-Tron కార్. సేవా కార్యక్రమాలను మరింత సమర్థంగా చేసేందుకు ఇది నాకు కొత్త శక్తిని, ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. నా ప్రతి ప్రయాణంలోనూ ఈ కార్‌ నాకు తోడుగా ఉంటోంది. నా జీవితాన్ని ఎఫీషియెంట్‌గా మార్చేసింది. నాకు ఇందులో బాగా నచ్చిన ఫీచర్ ఒకటి ఉంది. మనకు కావాల్సిందేదో వాయిస్ కమాండ్ ద్వారా చెబితే ఆ పని క్షణాల్లో పూర్తైపోతుంది. కావాలంటే చూడండి" అంటూ వాయిస్ కమాండ్ ఇచ్చారు ఉపాసన. అలా ఇచ్చిన వెంటనే ఆమె అడిగిన పాట ప్లే అయింది. యాపిల్‌లో వచ్చే "సిరి" తరహాలో ఇది పని చేస్తోంది. 2021 జులైలో భారత్‌లో విడుదలైంది ఆడీ e-Tron కార్. ఆడీ e-Tron 55, ఆడీ e-Tron స్పోర్ట్స్ బ్యాక్ 55 ఇలా రెండు వేరియంట్లు లభ్యమవుతున్నాయి. డిజైన్‌లో ఈ రెండూ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 359-484 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. మరో స్పెషాల్టీ ఏంటంటే... కేవలం 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 


Also Read: Tollywood Bandh : రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్


Also Read: Harish Rao: చెత్త క్లీన్ చేసిన మంత్రి హరీశ్ రావు, 10 నిమిషాలు అందరూ చేయాలని పిలుపు