Sanjay Raut ED Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు- 'తగ్గేదేలే' అంటూ ట్వీట్

ABP Desam   |  Murali Krishna   |  31 Jul 2022 12:49 PM (IST)

Sanjay Raut ED Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

(Image Source: PTI)

Sanjay Raut ED Case: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు చేస్తోంది. పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో విచారణ కోసం హాజరుకావాలని సంజయ్ రౌత్‌కు ఈడీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఆ ఆదేశాలను పాటించకపోవడంతో ఈ చర్యలు చేపట్టింది.

ఈడీ వేట

భాజపా, ఏక్‌నాథ్ శిందే వర్గంపై తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెంటాడుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారుల బృందం సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబయి బందూప్‌లో ఉన్న సంజయ్ నివాసానికి చేరుకున్నారు.

తనిఖీలు ప్రారంభించారు. ముంబయిలోని ఓ భవనం అభివృద్ధి, దానికి సంబంధించిన లావాదేవీలు, ఆయన సతీమణి, సన్నిహితుల లావాదేవీలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

లొంగిపోయేది లేదు

ఈడీ అధికారులు తన నివాసానికి చేరుకున్న తర్వాత సంజయ్ రౌత్ ఓ ట్వీట్ చేశారు. ఎన్ని విధాలుగా భయపెట్టినా తగ్గేదేలేదు అన్నారు.

తప్పుడు చర్య, తప్పుడు సాక్ష్యాలు. నేను శివసేనను వీడను. నేను మరణించినా సరే, లొంగిపోయేది లేదు. నాకు ఎలాంటి కుంభకోణంతోనూ సంబంధం లేదు. శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే మీద ప్రమాణం చేసి ఈ విషయం చెప్తున్నాను. పోరాడటాన్ని ఆయన మాకు నేర్పించారు. శివసేన కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను.                                                            - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ

Also Read: Removing Condom During Sex: సెక్స్ మధ్యలో కండోమ్ తీసేసినందుకు జైలు శిక్ష- కోర్టు సంచలన తీర్పు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 19 వేల కరోనా కేసులు- 39 మంది మృతి

Published at: 31 Jul 2022 12:36 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.