'జబర్దస్త్' సాక్షిగా మొదలైన 'రాకింగ్' రాకేష్, 'జోర్దార్' సుజాత ప్రేమ వ్యవహారం టీవీ ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. అయితే, వీరి ప్రేమ గురించి ఒక కొత్త విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. 'జబర్దస్త్'తో పాటు ఈటీవీలో వస్తున్న మరో ప్రోగ్రామ్ 'మిస్టర్ అండ్ మిస్సెస్' షో కూడా చేస్తున్నారు. 


లేటెస్టుగా విడుదలైన 'మిస్టర్ అండ్ మిస్సెస్' ప్రోమోలో రాకేష్ ప్రేమ గురించి సుజాత మాట్లాడుతూ "నాకు దేవుడు చిన్నప్పటి నుంచీ పరీక్షలు పెట్టాడు. కానీ, నువ్వు నన్ను స్మశానానికి తీసుకు వెళ్లి పరీక్ష పెట్టావ్'' అని అన్నారు. ఆ ప్రోమో చూసిన వాళ్ళు 'ఇదేం ప్రేమ పరీక్షరా బాబు... స్మశానానికి ఎందుకు తీసుకెళ్ళావ్? తీసుకెళ్లి ఏం చేశావ్?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.


రాకేష్ అలా ఎందుకు అలా చేశాడు? ఇప్పుడు అతడు ఏం చెప్తాడు? అనేది పూర్తి ఎపిసోడ్ విడుదల అయ్యే వరకు ఎదురు చూడాలి. 'రాకింగ్' రాకేష్, సుజాత ప్రేమ  కథ కొన్ని రోజుల నుంచి వినబడుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఒకసారి 'గెటప్' శ్రీను కూడా చెప్పారు. వచ్చే ఏడాది లోనే వీరిద్దరూ ఒక్కటవుతారని తెలుస్తోంది.



సాధారణంగా టీవీ షోలు, సీరియళ్లలో నటించే చాలా జంటలు బయట కూడా అలాగే ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ, దాదాపు అందరూ మేకప్ తీశాక ఎవరి లైఫ్ వాళ్ళు గడుపుతారు. కొంత మంది మాత్రం రీల్ జంటగా ప్రయాణం మొదలు పెట్టి... రియల్ లైఫ్ లో కూడా ఒక్కటి అవుతారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. అలాంటి జంటల్లో రాకింగ్ రాకేష్, జోర్డార్ సుజాత జంట ఒకటిగా నిలుస్తుందని టీవీ ఇండస్ట్రీ టాక్. 


'జబర్దస్త్'  లాంటి కామెడీ షోలలో నటించే చాలా జంటలు కేవలం షో కోసమే నటిస్తారు. సుధీర్ - రష్మీ, ఇమ్ము - వర్ష ఇలా చాలా జంటలు అలా చేస్తున్నారు. అయితే, రాకేష్, సుజాత కలిసి వరుస స్కిట్ లు చేశారు. ఈ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించిందట. అయితే మొదట్లో వీరిద్దరి జంటను ఫేక్ జంట అన్నారు. కానీ వాళ్ళు నిజంగానే లవ్ లో ఉన్నారని తరవాత తెలిసింది.


Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్


శ్రీముఖి హోస్ట్ గా చేస్తోన్న 'మిస్టర్ అండ్ మిసెస్' ప్రోగ్రాంలో పాల్గొంటున్న పది జంటల్లో రాకేష్, సుజాత జంట ఒకటి. మొదట్లో రాకేష్, సుజాతల ప్రేమ కేవలం రేటింగ్ కోసమే చేస్తున్నారని, నిజం కాదని కామెంట్స్ చేశారు. తర్వాత ఓ టీవీ ప్రోగ్రాం లో రాకేష్ సుజాతకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేశాడు, అది కూడా ఫేక్ అన్నారు. చివరికి వాళ్ళిద్దరూ ఇతర వేదికలపై స్వయంగా ప్రకటించడంతో ఇప్పుడు అందరూ అల్ ది బెస్ట్ చెప్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పలు ప్రోగ్రామ్స్ లలో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. వీరి పెళ్లికి ఇరు వర్గాల పెద్దలు ఒప్పుకోవడంతో రూట్ క్లియర్ అయింది.  ఈ ఏడాది లోనే వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది లో ఈ జంట ఒక్కటవుతారేమో చూడాలి.