సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు శనివారం ఆకస్మికంగా మరణించారు. ఆయన  కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి విషమించడంతో శనివారం రాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. రమేష్ బాబు మరణవార్త విని పలువురు ప్రముఖ నటులు స్పందించారు. ట్విట్టర్లో తమ సంతాపాన్ని ప్రకటించారు. 


సినీ హీరోలు చిరంజీవి, వెంకటేష్ సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని ప్రకటించారు. చిరు ట్వీట్ చేస్తూ ‘రమేష్ బాబు  హఠాన్మరణం నన్ను షాక్ కు గురిచేసింది. తీవ్ర బాధలో ముంచివేసింది.  కృష్ణ గారు, మహేష్ బాబు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అలాగే హీరో వెంకటేష్ ‘రమేష్ బాబు గారు హఠాత్తుగా మరణించడం షాక్‌కు గురి చేసింది. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మహేష్ బాబు, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. 






Also read: హీరోగా గాలి జనార్థన రెడ్డి కొడుకు, పాన్ ఇండియా స్థాయిలో సినిమా