విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషీ’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 1న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను థియేటర్‌లో కూడా ప్రదర్శిస్తున్నారు. ఇదే ఇప్పుడు నటుడు, సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యను ఇబ్బంది పెట్టిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. అదెలా అనుకుంటున్నారా?


ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘బాయ్స్ హాస్టల్’ స్పెషల్ స్క్రీనింగ్‌కు నాగ చైతన్య కూడా హజరయ్యారు. అయితే, మూవీ ఇంటర్వెల్ సమయంలో ఆ థియేటర్‌లో ‘ఖుషి’ మూవీ ట్రైలర్‌ను ప్రదర్శించారట. అయితే, అది నాగ చైతన్యకు ఇబ్బంది కలిగించిందని, దీంతో వెంటనే సీటు నుంచి లేచి బయటకు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. తప్పు తెలుసుకుని ఆపరేటర్ ఆ ట్రైలర్ ఆపేలోపే చైతూ బయటకు వెళ్లిపోయాడనేది సమాచారం. దీన్ని హైలెట్ చేస్తూ.. ఇప్పటికే పలు వెబ్ సైట్‌లలో వార్తలు వచ్చాయి. దీనిపై ‘బాయ్స్ హాస్టల్’ టీమ్ గానీ, చైతన్య గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ వార్త వైరల్ కావడంతో ‘ఖుషి’ మూవీలో విజయ్ దేవరకొండ, సమంతల రొమాన్స్ చూడలేకే చైతూ వెళ్లిపోయి ఉంటాడని కొందరు, అందులో కొన్ని సీన్లకు చైతూ కనెక్ట్ అయ్యి ఉంటాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సమాచారం ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. 


విడాకుల తర్వాత చైతూ సైలెంట్


విడాకుల తర్వాత సమంత చేసిన కామెంట్స్ అక్కినేని ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టాయో తెలిసిందే. అయితే, చైతన్య మాత్రం ఆమె గురించి గానీ, తన విడాకుల గురించి గానీ ఎక్కడా మాట్లాడలేదు. సమంత విషయాన్ని ప్రస్తావించినప్పుడు పాజిటివ్‌గానే స్పందించేవారు. కానీ, విడాకులు తీసుకున్ని సుమారు మూడేళ్లు అవుతున్నా.. మీడియా ఇంకా అదే విషయాన్ని ప్రస్తావించడం అక్కినేని ఫ్యామిలీని ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ చికిత్స తీసుకుంటుంది. ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు కొత్త సినిమాలకు సైన్ చేయకూడదని నిర్ణయించుకుంది. 


Also Read: రచ్చ గెలిచాం, ఇంట గెలవలేమా? నంది అవార్డులు అటకెక్కినట్లేనా?


‘ఖుషి’కి సెన్సార్ పూర్తి 


‘ఖుషి’ మూవీ ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది.  ఇంకా ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే... 165 నిమిషాలు. అంటే.. రెండు గంటల 45 నిమిషాలు అన్నమాట. ఈ సినిమా హిట్ కావడంతో సమంతకు, విజయ్ దేవరకొండకు చాలా ముఖ్యం. దీనికి ముందు సామ్ చేసిన ‘శాకుంతలం’, విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీస్ ఎంత ఘోర పరాజయాన్ని చవిచూశాయో తెలిసిందే. ప్రస్తుతం ‘ఖుషి’పై మంచి అంచనాలే ఉన్నాయి. హిట్ కొడుతుందో లేదో చూడాలి.


Also Read: RRR సినిమా 2022 లో రిలీజైతే, 2021 అవార్డ్స్ ఎందుకు ఇచ్చారో తెలుసా..?