‘సమర సింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’, ’ఇంద్ర’ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆరడుగులు బుల్లెట్’.   2017లో రూపుదిద్దుకున్న ఈ  యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని కారణాల వల్ల  ఆ ఏడాది విడుదలకాలేదు.  ఆ తర్వాత కూడా రిలీజ్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కరోనా సమయంలో ఓటీటీ లో  విడుదల చేస్తున్నట్టు వార్తలొచ్చినా అవీ నిజం కాలేదు. ఇప్పటివరకూ ఎన్నో అడ్డంకులు అధిగమించిన ఈ సినిమాను ఎట్టకేలకు అక్టోబర్ 8న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గోపీచంద్ ను మాస్ అవతారంలో చూపిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.





 గోపీచంద్ - నయనతార జంటగా నటించిన ఈ సినిమాను జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మించారు.  సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన 'సీటీమార్'   ఈ మధ్యే విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో  ఇదే మంచి సమయం అని భావించిన మేకర్స్  'ఆరడుగుల బుల్లెట్' ను వదులుతున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్ , కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం , జయ ప్రకాష్ రెడ్డి, చలపతిరావు ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.  దర్శకుడు, రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందించారు. అయితే అక్టోబరు 8న మెగా హీరో -క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కొండ పొలం' విడుదలవుతోంది. ఉప్పెనతో క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సినిమాకి క్రిష్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి గోపీచంద్, వైష్ణవ్ తేజ్ ఇద్దరిలో  ఎవరెలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.


Also Read:ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటించి.. మా అధ్యక్ష అభ్యర్థి పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్న నటుడు


Also Read: 'పరికిణిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. అయ్యో రామా క్యా కరే'..'వరుడు కావలెను' సినిమా నుంచి మరో పాట


Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు


Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి