హైదరాబాద్‌లో అకస్మాత్తుగా పెట్టిన కర్ఫ్యూ కారణంగా ‘పుష్ప 2’ ప్రమోషన్లకి అడ్డంకులు కలిగే ప్రమాదం ఉంది. ఈ సినిమాపై బిగ్ బాస్ స్టేజీ మీద అనసూయ మంచి హైప్ కూడా ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. విజయ్ దేవరకొండపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. వేణు స్వామిపై వారంలోపు చర్యలు తీసుకోమని మహిళా కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.


"పుష్ప 2" ప్రీ రిలీజ్ ఈవెంట్​కు అడ్డంకులు...
"పుష్ప 2" మూవీ భారీ హైప్ తో డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ ఇంకా షురూ కాకముందే అడ్డంకి ఏర్పడింది. భారీ ఎత్తున మేకర్స్ జరిపించాలి అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం అన్నది అల్లు అర్జున్ అభిమానుల్ని టెన్షన్ పెడుతోంది. ఇక ఇప్పుడు "పుష్ప 2 " మేకర్స్ కు ఉన్నది ఒకటే ఆప్షన్. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎదురైన అడ్డంకి ఏంటి? ఇప్పుడు 'పుష్ప' మేకర్స్ ముందు ఉన్న ఆ ఒక్క ఆప్షన్ ఏంటి? అనే విషయాలను చూద్దాం పదండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


"పుష్ప 2"పై పిచ్చ హైప్ పెంచిన అనసూయ...
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ "పుష్ప". ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు "పుష్ప 2" అంటూ ఈ మూవీకి సీక్వెల్ ను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా అనసూయ భరద్వాజ్ బిగ్ బాస్ షోలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించి సినిమాపై పిచ్చ హైప్ పెంచేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)



"లక్కీ భాస్కర్"పై త్రివిక్రమ్ ఫస్ట్ రివ్యూ...
'లక్కీ భాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ 'కొత్తతరం నటుల్లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇద్దరూ గొప్ప నటులు' అంటూ యంగ్ స్టార్స్ ఇద్దరిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఆయన సినిమా గురించి మాట్లాడుతూ 'సాధారణంగా మనం సినిమాలను చూసేటప్పుడు అందులో ఉన్న హీరో గెలవాలని కోరుకుంటాము. ఈ సినిమా చూసినప్పుడు నాకు మాత్రం డిఫరెంట్ గా అనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


విజయ్ దేవరకొండపై మాటల మాంత్రికుడి ప్రశంసలు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  హైదరాబాద్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ విజయ్ దేవరకొండపై ప్రశంసల జల్లు కురిపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్
జ్యోతిషుడు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. గతంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళలకు నిశ్చితార్థం జరిగిన సమయంలో... వారిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటారని వేణు స్వామి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు. దీంతో వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్... మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తమ ముందు విచారణకు హాజరు కావాలని వేణు స్వామిని మహిళా కమిషన్ ఆదేశించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)