Mahesh Babu Letter To SSMB Fans: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక లేఖ రాశారు. త్వరలో విడుదల కానున్న సర్కారు వారి పాట సినిమాతో పాటు ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాల గురించి ఆ లేఖలో ప్రస్తావించారు.


'గీత గోవిందం' విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమా 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata). మహేష్ బాబుతో ఆయనకు తొలి చిత్రమిది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని అభిమానులు మహేష్ బాబు కోరారు. అలాగే, వాళ్ల స్పందన తెలియజేయమని ఆయన అడిగారు. 


Also Read: సిక్స్‌ప్యాక్‌తో వ‌చ్చిన సందీప్ కిష‌న్‌, 'మైఖేల్' గట్స్ & గన్స్ చూశారా?


త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ చినబాబు నిర్మించే ఈ సినిమా (SSMB 28 Shooting Update) రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో మొదలు సూపర్ స్టార్ తెలిపారు. ఆయన అభిమానులతో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ అభిమానులు మహేష్ బాబు లేఖతో సంతోషంగా ఉన్నారు. 


'సర్కారు వారి పాట' ట్రైలర్, ఇప్పటివరకూ విడుదలైన పాటలు ఘట్టమనేని అభిమానులను మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


Also Read: 'బాహుబలి 2'ను బీట్ చేస్తుందా? 'కెజియఫ్ 2 కొత్త రికార్డు - 400 నాటౌట్