Case Filed Hero Raj Tarun: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా రాజ్‌ తరుణ్‌పై నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం(జూన్‌ 5) చీటింగ్‌ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసు రాజ్‌ తరుణ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.


అంతేకాదు తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు  చెప్పింది. అయితే కొంతకాలం రాజ్‌ తరుణ్‌ సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకున్నాడని, ఆమె మాయలో పడిన అతడు తనను వదిలేశాడని బాధిత యువతి ఆరోపించింది. అంతేకాదు ఆమె రిలేషన్‌లో ఉండటమే కాకుండ తనని వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నాడని, లేదంటూ చంపేస్తానని బెదిరిస్తున్నట్టు సదరు యువతి ఫిర్యాదు పేర్కొంది. అలాగే తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించాడని, తాను 45 రోజులు జైల్లో ఉన్నానని పోలీసులు ఎదుట ఆమె వాపోయింది.



మూడు నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నాడని, అమ్మాయిల పిచ్చి ఉన్న రాజ్‌ తరుణ్‌పై చర్యలు తీసుకోవాలి బాధితురాలు డిమాండ్‌ చేస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసుల ఎదుట వాపోయింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు. కాగా చివరిగా 'నా సామిరంగ' సినిమాలో కీలక పాత్ర పోషించిన రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం ‘తిరగబడరసామీ’ అనే మూవీ చేస్తున్నాడు. ఏఎస్‌ రవికుమార దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 



Also Read: తండ్రి కాబోతున్న 'బ్రహ్మముడి' హీరో రాజ్‌ - త్వరలో బేబీ నాగులపల్లి రాబోతుందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పిన మానస్‌