టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి ఎన్నో అగ్ర నిర్మాణ సంస్థలు, ఎంతో మంది నిర్మాతలు వస్తున్నా, దిల్ రాజు స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకంటే ఆయన స్టార్ హీరోలతో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసి వాటిని తన బ్యానర్లో రిలీజ్ చేసి భారీ లాభాలను అందుకున్నాడు. అంతేకాదు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలు ఎంచుకుని వాటిని నిర్మించడం దిల్ రాజు లో ఉన్న స్పెషల్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అలా రీసెంట్గా చిన్న సినిమాగా దిల్ రాజు సంస్థ నుండి వచ్చిన 'బలగం' ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే దిల్ రాజు ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రెడీ అయ్యారు.


ఆ సినిమా పేరే 'వాలాట్టి'. సాధారణంగా మనుషులు సాహసాలు చేయడాన్ని మనం చూసుంటాం. వాటిని ఆధారంగా తీసుకొని సినిమాలను కూడా రూపొందించారు. కానీ మొట్టమొదటిసారి కుక్కల సాహసాన్ని తెరపై చూపించనున్నారు. శోభు షాహిర్, సన్నీ వానే, రోషన్ మాథ్యూ, ఇంద్రన్స్, సజ్జు కురుప్ తదితరులు ఈ సినిమాలో కుక్కల పాత్రలకు వాయిస్ ఓవర్ ని అందించారు. లవ్, కామెడీ, అడ్వెంచర్ అన్నీ కలిగలిపి ఓ సరికొత్త కోణంలో ఈ సినిమా సాగుతుంది. కే ఆర్ జి స్టూడియోస్ అధినేత కార్తీక్ గౌడ కేరళ మినహా ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విలక్షణమైన కథనాలు, పాత్రలతో రూపొందిన వాలాట్టి చిత్రం యూత్ తోపాటు పెద్దవాళ్లకు కూడా నచ్చుతుందని తెలిపారు. ఇక తెలుగులో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అలాగే హిందీలో అనిల్ తడాని హోమ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఓవర్సీస్ లో ఈ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నట్లు కార్తీక్ గౌడ తెలిపారు. దేవన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని విజయ్ బాబు సమర్పణలో ఫ్రైడే ఫిలిం హౌస్ బ్యానర్ నిర్మించింది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక జూలై 14న మలయాళం లో ముందుగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు మేకర్స్. మలయాళం లో విడుదలైన వారం రోజుల తర్వాత తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. మరి తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో ఉంటుందో చూడాలి. కాగా ప్రస్తుతం దిల్ రాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' సినిమాని నిర్మిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రూపొందుతోంది. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ  హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.


Also Read: 'పుష్ప' విలన్ లేటెస్ట్ మూవీ 'ధూమం' - తెలుగు రిలీజ్ లేనట్టేనా?