బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'జిగ్రా'. ఈ సినిమా దసరా కనుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే కొంతమంది మాత్రం సినిమా కొత్త తరహా కథతో ఇంట్రెస్టింగ్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'జిగ్రా' మూవీపై సమంత రివ్యూ ఇచ్చింది. 


'జిగ్రా'పై సమంత రివ్యూ... 
'ఆడ పులి అలియా భట్.. నీ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. సినిమాను చూస్తున్నంతసేపు కళ్ళు తిప్పుకోలేక పోయాను. నువ్వు తీసుకునే బ్రేవ్ ఛాయిస్ లు, స్టాండర్డ్స్ నిన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తాయి. కీప్ ఇన్స్పైరింగ్' అంటూ అలియా భట్ ను, సినిమాలో ఆమె నటనను మెచ్చుకుంది సామ్. ఆ తర్వాత 'డైరెక్టర్ వాసన్ బాలా మీరు సినిమాను యూనిక్ గా తీశారు' అంటూనే సినిమాలో నటించిన మిగతా నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ పై కూడా ప్రశంసల జల్లు కురిపించింది సమంత. ఇన్స్టాగ్రామ్ వేదికగా సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 


'జిగ్రా' స్టోరీ మొత్తం అక్కాతమ్ముడి చుట్టూ తిరుగుతుంది. సత్యభామ, ఆనంద్ ఇద్దరూ అక్కా తమ్ముళ్లు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి కూడా చనిపోవడంతో తమ్ముడు ఆనంద్ ని చిన్నప్పటి నుంచే సత్యభామ పెంచి పెద్ద చేస్తుంది. ఇక హీరోయిన్ హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్ గా ఓ రిచ్ ఫ్యామిలీ ఇంట్లో పని చేస్తుంది. ఆ ఇంట్లో ఉండే అబ్బాయి కబీర్, హీరోయిన్ తమ్ముడు ఆనంద్ ఫ్రెండ్స్. కానీ అతనికి ఉన్న బాడ్ హ్యాబిట్స్ కారణంగా తమ్ముడిని దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఆనంద్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. తమ్ముడిని కాపాడుకోవడానికి హీరోయిన్ ఏం చేసింది? అతనికి మలేషియాలో ఉన్న రూల్స్ ప్రకారం మరణ శిక్ష పడిందా? చివరికి తమ్ముడిని బయట పడేయగలిగిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. 


ఫేక్ కలెక్షన్ల గొడవ 
ఈ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా రావడమే కాకుండా 'జిగ్రా' మూవీ బాగుంది అంటూ సోషల్ మీడియా ద్వారా సమంత సినిమాపై ప్రేమను కురిపిస్తుంటే, మరో బాలీవుడ్ నటి దివ్య ఖోస్లా మాత్రం 'జిగ్రా' సినిమాకు ఫేక్ కలెక్షన్స్ ప్రకటిస్తున్నారని ఫైర్ అయ్యింది.
 'సినిమా చూడడానికి వెళ్తే థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ వాళ్ళే టికెట్లు కొనేసి, ఫేక్ కలెక్షన్లు అనౌన్స్ చేస్తున్న అలియా భట్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పెయిడ్ మీడియా కూడా సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేయకండి' అంటూ ఆమె చేసిన పోస్ట్ గా వైరల్ అయింది. ఈ పోస్ట్ పై నిర్మాత కరణ్ జోహార్ 'మూర్ఖులకు సైలెంట్ గా ఉండటమే సమాధానం' అంటూ పరోక్షంగా రిప్లై ఇచ్చారు. 




Also Read: Nara Rohit Engagement: చంద్రబాబు ఆశీస్సులతో నారా రోహిత్ నిశ్చితార్థం - కాబోయే కొత్త జంట ఫోటోలు చూడండి