బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా 'బిగ్ బాస్ ఓటిటి 2' ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రియాలిటీ షోలో ప్రముఖ జ్యోతిష్కురాలు బేబీకా దుర్వే ఓ కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. తాజాగా హౌస్ లో ఆమె హోస్ట్ సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు సల్మాన్ ఖాన్ ప్రేమలో మోసపోయాడని, ఇప్పుడు ఆయనకి హోమ్లీ వైఫ్ కావాలని చెప్పింది. తన తోటి కంటెస్టెంట్ మనీషా రాణి తో ఆమె మాట్లాడుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ ఎప్పుడైనా ప్రేమలో మోసపోయారా? అని బేబీకాను మనిషా అడిగినప్పుడు, అందుకు బేబీకా సమాధానం ఇస్తూ.. "సల్మాన్ ఖాన్ తనను తాను ఎంతో కఠినంగా, ఎలాంటి ఎమోషన్స్ లేనివాడిగా బయట ప్రపంచానికి చూపిస్తాడు. కానీ అతను ఎంతో లోతుగా ప్రేమను చూపించే మృదుస్వభావి. తల్లిదండ్రులకు సేవ చేయడం, ఇతరుల పట్ల సేవాభావాన్ని చూపించడం, తనని బాగా అర్థం చేసుకునే హోమ్లీ వైఫ్ ని అతను కోరుకుంటాడు. షూటింగ్ అయిపోయాక సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రుచికరమైన భోజనం వడ్డించి, తర్వాత ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహాయం చేయాలి. అలా కేవలం ఇంటికి పరిమితమై అతని బాగా చూసుకునే అమ్మాయి మాత్రమే కావాలి" అని బేబీకా చెప్పుకొచ్చింది.


కాగా ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ తన పెళ్లి గురించి ఓ బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు.. "పెళ్లి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దేవుడు కోరుకుంటే కచ్చితంగా అది అవుతుంది. వివాహానికి ఇద్దరు వ్యక్తులు అవసరం. నాకు ఫస్ట్ అటెంప్ట్ లో పెళ్లి జరగలేదు. నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెళ్లికి ఓకే అన్నప్పుడు ఎవరో నో అని చెప్పారు. ఆ తర్వాత ఎవరో 'ఎస్' అని చెప్పినప్పుడు నేను 'నో' అన్నాను.  ఆ తర్వాత రెండు వైపుల నుంచి 'నో' అనే సమాధానమే వచ్చింది. ఎప్పుడైతే రెండు వైపులా 'ఎస్' అనే సమాధానం వస్తుందో, అప్పుడు పెళ్లి జరుగుతుంది. దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం నా వయసు 57 సంవత్సరాలు. ఈసారి చేసే ప్రయత్నం అదే మొదటిది మరియు చివరిది కూడా కావాలి" అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్.


ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ షోను పోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ త్వరలోనే 'టైగర్ 3' మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాతో మరోసారి కత్రినా కైఫ్ తో జోడి కడుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరూ టైగర్ హిట్ ఫ్రాంచైజీ అయిన 'ఏక్తా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'టైగర్ త్రీ' తో రాబోతున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 10 న విడుదల కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనుండగా, షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా హిందీ తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది.


Also Read: 'తొలిప్రేమ' వసూళ్ళలో కొంత జనసేన రైతు భరోసా యాత్రకు విరాళంగా...