స్టార్ హీరోయిన్ రష్మిక పేరు వార్తల్లో వినబడుతోంది. అందుకు కారణం సినిమాలు లేదా వ్యక్తిగత జీవితం కాదు. రష్మిక ప్రమేయం లేకుండా ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఓ ఫేక్ వీడియో చుట్టూ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ ద్వారా రష్మిక ఫేస్ ఉపయోగించి ఓ మార్ఫింగ్ వీడియో క్రియేట్ చేశారు. అది వైరల్ అవుతోంది.


రష్మికకు అండగా లెజెండరీ హీరో అమితాబ్ బచ్చన్ సహా యువ తెలుగు హీరోలు అక్కినేని నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నటి ఖుష్బూ, గాయని చిన్మయి శ్రీపాద తదితరులు స్పందించారు. ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకు రావాలని కోరారు. అయితే... ఈ వీడియో చుట్టూ విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ ఇండియన్ మోడల్ జరా పటేల్ కూడా స్పందించారు. 


ఏం జరుగుతోంది? - జరా పటేల్ ప్రశ్న!
ఫేక్ వీడియోలో రష్మిక ఫేస్ కనబడుతోంది. అయితే... ఆ బాడీ మాత్రం ఆమెది కాదు. బ్రిటిష్ ఇండియన్ మోడల్ జరా పటేల్ వీడియో తీసుకుని, అందులో ఆమె ముఖం బదులు రష్మిక కనిపించేలా మార్ఫింగ్ చేశారు. తన వీడియో ఈ వివాదానికి కారణం కావడంతో జరా పటేల్ స్పందించారు. ''ఏం జరుగుతోంది?'' అంటూ ఆమె ప్రశ్నించారు. 


రష్మిక వీడియోతో నాకు సంబంధం లేదు!
''నా బాడీని ఉపయోగించి ఎవరో ప్రముఖ బాలీవుడ్ నటి (రష్మికా మందన్నా - Rashmika Mandanna) డీప్ ఫేక్ (మార్ఫింగ్) వీడియో క్రియేట్ చేసిన అంశం నా దృష్టికి వచ్చింది. ఆ వీడియోతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది చూసి నేను బాగా డిస్టర్బ్ అయ్యా. అసలు ఏం జరుగుతోంది?'' అని జరా పటేల్ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. 


Also Read : పవన్ కళ్యాణ్ సినిమాపై పుకార్లకు చెక్ పెట్టిన హరీష్ శంకర్ - 'నో' రవితేజ సినిమా!


ఇంటర్నెట్ ప్రపంచంలో మనం ఏం ఏం చూస్తున్నామో చెక్ చేసుకోవాలని జరా పటేల్ పేర్కొన్నారు. ఒకటికి రెండుసార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని ఆమె తన ఇన్స్టా స్టోరీలో పేర్కొంది. మొత్తం మీద రష్మిక వీడియో ఇండస్ట్రీ ప్రముఖులలో కొత్త చర్చకు దారి తీసింది. సెలబ్రిటీలకు టెక్నాలజీ ద్వారా ఎటువంటి ముప్పు ఎదురు అవుతుందనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీంతో అమ్మాయిలు, మహిళలు భవిష్యత్తులో తమ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మరింత భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం జరా పటేల్ పోస్టులో వ్యక్తం అయ్యింది. 


Also Read వైఎస్ జగన్ 'యాత్ర 2'లో సోనియా గాంధీ - ఫస్ట్ లుక్ వచ్చేసింది!




ప్రస్తుతం రష్మిక చేస్తున్న సినిమాలకు వస్తే... హిందీలో రణబీర్ కపూర్ జోడీగా 'యానిమల్' చేస్తున్నారు. ఆ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2'లో సైతం రష్మిక నటిస్తున్నారు. 'పుష్ప : ది రైజ్' సినిమాలో ఆమె నటనకు... 'సామి సామి' పాటలో స్టెప్పులకు మంచి పేరు వచ్చిన సంగతి తెలుసు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'రెయిన్ బో' సినిమా ఒకటి ఉంది. ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న సినిమాలో కూడా రష్మిక హీరోయిన్.