Ranbir, Sai Pallavi Ramayana : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ 'యానిమల్' మూవీ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక ‘యానిమల్’ మూవీతో రణబీర్ కి సౌత్ లోనూ భారీ క్రేజ్ ఏర్పడడంతో ఈ హీరో నటించే తదుపరి సినిమాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. యానిమల్ తర్వాత రణ్ బీర్ 'రామాయణం' సినిమాలో నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తివారి మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమాని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించనున్నారు.


ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్, సీతాదేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. 'కేజిఎఫ్' హీరో యశ్ ఇందులో రావణుడి పాత్రను పోషించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. 2024 మార్చిలో రామాయణం షూటింగ్ మొదలవుతుందని మూవీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. యానిమల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుంటున్న రణ్ బీర్ మార్చిలో ఈ మూవీ షూటింగ్‌కు వెళతారని సమాచారం. ‘కేజిఎఫ్’ హీరో యశ్ మాత్రం 2024 జూలైలో రామాయణం షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే మూవీ చేస్తున్న యశ్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాకే రామాయణం సెట్స్ లో అడుగుపెట్టనున్నారట.


కాగా రామాయణం పార్ట్ వన్ లో యశ్ కనిపించేది కొద్ది సమయం మాత్రమేనని, పార్ట్ 2 మొత్తం రావణుడిగా యష్ పాత్ర పైనే కథ నడుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ VFX కంపెనీ DNED పనిచేస్తోంది. ఈ మూవీ కోసం సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ ల 3D స్కాన్ లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు మూడు భాగాలుగా వస్తోంది. 2025లో రామాయణ : పార్ట్ వన్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సన్నీడియోల్ మూవీ టీం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే అతనితో టీం చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బాలీవుడ్ నుంచి రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమా వచ్చింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది. దానికి తోడు ఎన్నో విమర్శలు రావడంతో డైరెక్టర్ నితీష్ తివారి గతంలో జరిగిన మిస్టేక్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రామాయణం ప్రాజెక్టుపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ దగ్గర్నుంచి నటీనటులు, సాంకేతిక బృందం, VFX ఇలా ఏ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.


Also Read : ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీని చూడనున్న హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్, ఎందుకంటే..