Dil Raju Interesting Comments On SJ Surya: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాని హీరోగా, ఎస్ జే సూర్య విలన్ గా అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే, సీఐ దయానంద్ పాత్రలో సూర్య, నానిని డామినేట్ చేశారు. సూర్య నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.  


ఎస్జే సూర్యపై దిల్ రాజు ప్రశంసలు


తాజాగా ‘సరిపోదా శనివారం’ సినిమాకు సంబంధించి విజయ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎస్ జే సూర్య నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయన యాక్టింగ్ కు పేపర్లు పడతాయన్నారు. “ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ కు బిగ్ కంగ్రాట్యులేషన్స్. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ తో గౌస్ బంప్స్ క్రియేట్ అయ్యాయి. డైరెక్టర్ గతంలో తీసిన సినిమాలకు ఈ సినిమాకు అస్సలు సంబంధం లేదు. తనలోని స్టైలిష్, యాక్షన్ ను నాని ద్వారా తెలుగు ప్రేక్షకులకు చూపించారు. నాని 16 ఏండ్ల నుంచి తెలుగు ప్రేక్షకులకు డిఫరెంట్, డిఫరెంట్ గా క్లాస్, మాస్, యూత్ అంటూ ఆకట్టుకుంటున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇన్ని వేరియేషన్స్ ఇస్తున్న ఏకైక హీరో నాని. అందులో ఏమాత్రం డౌట్ లేదు. భయము, భక్తి, ప్రేమతో సినిమాను చేస్తే ఇలాంటి అద్భుత ఫలితాలే వస్తాయి. నాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఎస్జే సూర్య గారితో ఖుషీ సినిమా రోజు చేసుకున్న పార్టీ ఇప్పటి గుర్తుంది. దర్శకుడు  హీరోగా ట్రై చేసి, మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా అద్భుతంగా రాణించాడు. ‘గేమ్ ఛేంజర్’లోనూ ఇలాగే ఉంటుంది. మా సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తుంటే, తెలుగు సినిమాలో ఫ్రెష్ గా ఉంటాడు అనుకున్నాను. ఈ సినిమాతో ఆయన మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయన గురించి పేపర్లు పడుతాయి” అని చెప్పుకొచ్చారు. ‘సరిపోదా శనివారం’ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించారు.



‘గేమ్ ఛేంజర్’ గురించి..


పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ   జ‌య‌రామ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కొడుకు పాత్ర సరసన కియారా, తండ్రి పాత్రతో అంజలి నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.


Read Also: దర్శకుడు గౌతమ్ మీనన్‌కు బిర్యానీ వడ్డించిన మమ్ముట్టి... సోషల్ మీడియాలో వైరల్ వీడియో