'రాధే శ్యామ్' బడ్జెట్ ఎంత? యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ హీరో ప్రభాస్ మాటల్లో చెప్పాలంటే... 300 కోట్ల రూపాయలు. అవును... ప్రేమకథను దృశ్య కావ్యంగా తెరకెక్కించే క్రమంలో అంత ఖర్చు పెట్టారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో సినిమా బడ్జెట్ రివీల్ చేశారు ప్రభాస్. ఇంకా ఓ రిక్వెస్ట్ కూడా చేశారు.


'ప్రేమకు, విధికి జరిగిన యుద్ధం' అంటూ 'రాధే శ్యామ్'ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. చివరకు... ప్రేమ గెలిచిందా? విధి గెలిచిందా? ఈ సందేహం ఓ తమిళ విలేకరికి వచ్చింది. ప్రభాస్‌ను అడిగారు. "అది ఎలా చెబుతాను సార్? కనీసం 50 రూపాయల టికెట్ అయినా కొని సినిమా చూడండి. ప్రొడ్యూసర్స్ రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు నేను మీ ప్రశ్నకు సమాధానం చెబితే నన్ను చంపేస్తారు" అని ప్రభాస్ సమాధానం ఇవ్వడంతో అందరూ ఒక్కసారి నవ్వేశారు.


Also Read: 'రాధే శ్యామ్'లో మరో హీరోయిన్! రిలీజ్ ట్రైల‌ర్‌లో ఆ అమ్మాయిని గుర్తు పట్టారా?


'రాధే శ్యామ్' సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించిన సంగతి తెలిసిందే. ఆయన జోడీగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ 'రాధే శ్యామ్' సినిమాను నిర్మించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.


Also Read: తమన్ ట్వీట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి! ఎందుకంటే?