థాయ్‌లాండ్ నుంచి నేరుగా ముంబైలో దిగారు నయనతార. జూన్ 9న చిరకాల ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో లేడీ సూపర్ స్టార్ ఏడు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత థాయ్‌లాండ్‌కు హనీమూన్ ట్రిప్ వేశారు. థాయ్ నుంచి కొత్త జంట ఇండియాకు వచ్చేసింది. చెన్నైలోని అత్తారింటికి గానీ... కేరళలోని అమ్మగారింటికి గానీ నయన్ వెళ్ళలేదు. నేరుగా ముంబై వెళ్లారు. ఎందుకంటే... ఒక సినిమా షూటింగ్ కోసం!


బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా 'జవాన్'. అందులో నయనతార కథానాయిక. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ కన్ఫర్మ్ చేశారు. అప్పటికే... ఆయనతో నయన్ షూటింగ్ చేసిన పిక్స్ లీక్ అయ్యాయి అనుకోండి. ఆ సినిమా షూటింగ్ కోసం నయన్ ముంబైలో దిగారు. 


Also Read : వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్


ముంబైలో ఆదివారం 'జవాన్' కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అందులో నయన్ కూడా జాయిన్ అయ్యారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. జూలై రెండో వారం వరకూ ముంబైలో షూటింగ్ చేస్తారని టాక్. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న నయన్... మళ్ళీ షూటింగుల్లో బిజీ అయ్యారు. ఆల్రెడీ సంతకం చేసిన, సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత... కొత్త సినిమాలు అంగీకరిస్తారా? లేదా? అనేది తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. 


Also Read : డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి