శింబు కథానాయకుడిగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన తమిళ సినిమా 'మానాడు'. విడుదలకు ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ... విడుదలైన తర్వాత వసూళ్ల వర్షం కురిపించింది. తమిళనాట విమర్శలు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని దర్శకుడు వెంకట్ ప్రభు ధృవీకరించారు.


తెలుగు, హిందీ భాషల్లో 'మనాడు'ను రీమేక్ చేయనున్నట్టు వెంకట్ ప్రభు స్పష్టం చేశారు. అయితే... హీరోలు మారనున్నారు. తెలుగులో హీరోగా అక్కినేని నాగ చైతన్య కన్ఫర్మ్. హిందీలో ఎవరు చేస్తారనేది చూడాలి. ట్విస్ట్ ఏంటంటే... రెండు భాషల్లోనూ విలన్ ఒక్కరే. 'సరోజ', 'గ్యాంబ్లర్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా వెంకట్ ప్రభు తెలుసు. అయితే... ఆయన ఇప్పటివరకూ తెలుగు సినిమా చేయలేదు. 'మనాడు' రీమేక్ ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమా అని చెప్పాలి.


'ఏ మాయ చేసావె' తమిళ్ వెర్షన్‌లో శింబు హీరోగా నటించగా... తెలుగులో నాగ చైతన్య నటించారు. 'సాహసం శ్వాసగా సాగిపో'లో ఇక్కడ చైతన్య నటించగా... తమిళంలో శింబు చేశారు. ఆ రెండు సినిమాలూ అక్కినేని హీరోకి మంచి విజయాలు అందించాయి. అందువల్ల, 'మనాడు' రీమేక్ కూడా పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు.


'మనాడు' రీమేక్‌లో నాగచైతన్యకు జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్టు ఫిల్మ్ నగర్ ఖబర్. అయితే... ఆ విషయాన్ని దర్శకుడు చెప్పలేదు. నాగచైతన్యతో మరి కొంత మంది నటీనటులు ఉంటారని పేర్కొన్నారు. 'ఒక లైలా కోసం' సినిమాలో చైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన సంగతి తెలిసిందే.


Also Read : 'భీమ్లా నాయక్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడిపిన బండి కావాలా? అయితే ఇలా చేయండి!


ప్రస్తుతం నాగచైతన్య చేతిలో ఉన్న సినిమాలకు వస్తే... ఆల్రెడీ 'థాంక్యూ' సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. 'మనం' తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. ఇప్పుడు అదే దర్శకుడితో 'దూత' వెబ్ సిరీస్ చేస్తున్నారు. హిందీలో ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లోనూ నటించారు. 'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ సినిమా చర్చల దశలో ఉంది.


Also Read : జూన్‌ లో 'రామారావు ఆన్ డ్యూటీ', బాక్సాఫీస్‌ పై మాస్ మహారాజ దండయాత్ర ఆ రోజే మొదలు