ప్రముఖ నృత్య దర్శకుడు, కథానాయకుడు, దర్శకుడు ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మై డియర్ భూతం'. ఇందులో ఆయన జీనీగా నటించారు. ఆ గెటప్ పెద్దలతో పాటు పిల్లల్ని ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ ఆయన నటించిన చిత్రాలకు భిన్నమైన చిత్రమిది. ఫాంటసీ కథతో రూపొందిన ఈ సినిమా జూలై 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంతో పాటు తెలుగులో అదే రోజు విడుదల కానుంది.


తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన ఎన్. రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి. పిళ్ళై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. 


Also Read : కీరవాణి తప్పు చేశారా? బూతు ట్వీట్ డిలీట్ చేసినా...


'మై డియర్ భూతం' సినిమా వినోదంతో పాటు చక్కటి సందేశం అందిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. రమ్యా నంబీసన్, తమిళ 'బిగ్ బాస్' ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీత దర్శకుడు. 



Also Read : టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత