లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Babu) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ, తెలంగాణలో ఆయన చాలా పాపులర్. ఆయనకు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని జల్ పల్లి గ్రామంలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిలో దొంగతనం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


దొంగతనం చేసింది పని మనిషే!
మోహన్ బాబు ఇంటిలో దొంగతనం చేసింది ఎవరో కాదు... కొన్ని రోజుల నుంచి ఆ ఇంటిలో పని చేస్తున్న నాయక్ అనే వ్యక్తి. పది లక్షల రూపాయలు దొంగతనం చేసి అతడు పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ దొంగతనం మీద మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. 


తిరుపతిలో పని మనిషిని పట్టుకొన్న పోలీసులు
మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పని మనిషి నాయక్ కోసం గాలించడం మొదలు పెట్టారు. తిరుపతిలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దొంగతనం చేయడానికి కల కారణాలు ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.


Also Read: విడాకులకు కోర్టు మెట్లు ఎక్కిన 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ - ఎవరీ మోసిన్, ఆమె భర్త గురించి తెల్సా?


సినిమాలకు వస్తే... 'కన్నప్ప'లో మోహన్ బాబు నటిస్తున్నారు. ఆయన పెద్ద కుమారుడు విష్ణు మంచి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఆ సినిమాను స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు కూడా. డిసెంబర్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Also Readఎన్టీఆర్ ఎగ్జైట్‌మెంట్‌తో నెక్ట్స్ లెవల్‌కు... మనోళ్లకు అంత టైమ్ ఇస్తే అద్భుతాలే - కొరటాల శివ ఇంటర్వ్యూ