Mansoor Ali Khan : ప్రస్తుతం కోలీవుడ్‌లో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న విషయం ఏంటో చాలామందికి తెలిసింది. తన సహనటి, సీనియర్ హీరోయిన్ అయిన త్రిషపై సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ అసభ్యకరంగా ఉండడంతో దానిని ఖండిస్తూ ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఆయన ఆ కామెంట్స్ చేసిన కొద్దిసేపట్లోనే వైరల్ అయ్యి.. త్రిష సైతం వాటికి రియాక్ట్ అయ్యింది. అంత జరిగినా తాను సారీ చెప్పనని, తాను అన్న మాటల్లో తప్పు లేదు అన్న మన్సూర్.. తాజాగా త్రిషకు క్షమాపణలు చెప్పాడు. బాగా ఆలోచించిన తర్వాత త్రిష కూడా.. మన్సూర్ సారీకి రియాక్ట్ అయ్యింది.


విచారణ తర్వాత..
‘‘నా సహ నటి త్రిషకు సారీ’’ అంటూ తాజాగా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు మన్సూర్ అలీ ఖాన్. ఇక మన్సూర్ చెప్పిన సారీకి ట్విటర్ ద్వారా రియాక్ట్ అయ్యింది త్రిష. ‘‘తప్పులు చేయడం మానవ సహజం. క్షమించడం దైవత్వం’’ అంటూ పోస్ట్ షేర్ చేసింది ఈ సీనియర్ హీరోయిన్. ఇటీవల త్రిషపై చేసిన కామెంట్స్ వల్ల మన్సూర్ అలీ ఖాన్‌పై 354ఏ (లైంగిక వేధింపులు), సెక్షన్ 509 (మహిళలను కించపరచడం) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసం పోలీసుల ముందు హాజరయ్యాడు మన్సూర్. ఆ మరుసటి రోజే త్రిషకు సారీ చెప్పి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి త్రిష ‘‘తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవత్వం’’ అని సమాధానం ఇచ్చింది.






త్రిష వర్సెస్ మన్సూర్..
ఇటీవల లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘లియో’ చిత్రంలో త్రిషతో పాటు మన్సూర్ అలీ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించాడు. అయితే తను నటించిన ఇంతకు ముందు సినిమాల్లోలాగా హీరోయిన్‌ను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి రేప్ చేసే సీన్ ఉంటుందేమో అని ఆశించానని కానీ షూటింగ్ జరుగుతున్నంత కాలం కనీసం తనకు త్రిషను చూపించలేదని ఒక ఈవెంట్‌లో మన్సూర్ అలీ ఖాన్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. త్రిష సైతం ఈ కామెంట్స్‌కు వెంటనే రియాక్ట్ అయ్యింది. ఈ కామెంట్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఇలాంటి కామెంట్స్‌ను తాను ఖండిస్తున్నానంటూ, ఇక జీవితంలో మన్సూర్ అలీ ఖాన్‌తో కలిసి నటించడం కుదరదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.


సింపుల్‌గా ఒక్క పోస్ట్‌తో..
త్రిష ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై రియాక్ట్ అవ్వడానికి మన్సూర్ అలీ ఖాన్.. ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు. తను మామూలుగా అన్న మాటల వల్ల కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని, తనంటే ఇష్టం లేని వాళ్లు కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించాడు. అంతే కాకుండా ఈ విషయంలో సారీ చెప్పడం కుదరదు అంటూ అందరి ముందు ప్రకటించాడు. కానీ పోలీస్ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత మన్సూర్ మనసు మారిపోయినట్టుంది. అందుకే త్రిషకు సారీ చెప్పి ఈ వివాదాన్ని ముగించాలని అనుకున్నాడు. త్రిష కూడా పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఇన్‌డైరెక్ట్‌గా మన్సూర్‌ను క్షమిస్తున్నట్టు పోస్ట్ పెట్టి ఈ వివాదాన్ని ముగించింది. మరి ఇప్పటికైనా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు ఆగుతాయేమో చూడాలి.


Also Read: 'కాంతార' కొత్త చాప్టర్ ఫస్ట్ లుక్ - ఈసారి కాంతి కాదు, దర్శనమే! అంచనాలు పెంచిన రిషబ్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply