రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda Injured?), స్టార్ హీరోయిన్ సమంత (Samantha Injured?) జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఇటీవల కశ్మీర్ షెడ్యూల్ ముగించుకున్న చిత్ర బృందం హైదరాబాద్ చేరుకుంది. కశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేయడం వెనుక కారణం ఏమిటి? హీరో హీరోయిన్లు ఇద్దరికీ షూటింగులు గాయాలు అయ్యాయా? అందుకే, త్వరగా హైదరాబాద్ వచ్చేశారా? వంటి అనుమానాలు మొదలయ్యాయి. దీనికి పుకార్లే కారణం!


కశ్మీర్ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయ్యాయని... దాంతో దర్శకుడు శివ నిర్వాణ త్వరగా షెడ్యూల్ ముగించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిపై చిత్ర బృందం స్పందించింది. అది ఫేక్ న్యూస్ అని దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ చేశారు. 


''విజయ్ దేవరకొండ, సమంతకు గాయాలు అయినట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. విజయవంతంగా 30 రోజుల కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని, చిత్ర బృందం అంతా హైదరాబాద్ చేరుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. దయచేసి ఎటువంటి పుకార్లను నమ్మవద్దు'' అని 'ఖుషి' సినిమా యూనిట్ పేర్కొంది.


Also Read: ఎఫ్ 3 థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారో తెలుసా?






ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.


Also Read: అనసూయ సూపర్ స్టైల్ - సూపర్ సింగర్ జూనియర్ కోసం