టాలీవుడ్ లోని కొంతమంది హీరోలు ఫ్యాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్తుంటే, మరి కొంతమంది హీరోలు మాత్రం హిట్టు కోసం తహతహలాడుతున్నారు. ఆ లిస్టులో హీరో గోపీచంద్ కూడా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన సినిమాలేవి ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన 'భీమా' మూవీ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ, రిలీజ్ అయ్యాక మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ తాను నటిస్తున్న 'విశ్వం' మూవీ ప్రమోషన్లలో ఈ మూవీ గురించి స్పందించారు.


ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాను నాశనం చేసింది... 
గోపీచంద్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'విశ్వం'. దాదాపు ఆరేళ్ల తర్వాత 'విశ్వం' మూవీతో మళ్లీ డైరెక్టర్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు శ్రీనువైట్ల. ఈ సినిమాలో గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా, వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగు పూర్తి చేసుకున్న 'విశ్వం' మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఇటీవల కాలంలో రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ ను  క్రియేట్ చేసింది. ముఖ్యంగా ట్రైలర్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కాగా తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన 'భీమా' మూవీతో పాటు గతంలో తాను చేసిన డిజాస్టర్ మూవీ 'రామబాణం' గురించి కూడా స్పందించారు.


Read Also : Devara 10 Days Collections: 'దేవర' కలెక్షన్ల అరాచకం - 10 రోజుల్లోనే 500 కోట్లకు అతి చేరువలో!


'విశ్వం' మూవీ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారా? ఈ సినిమాతో నైనా బ్లాక్ బస్టర్ హిట్ కొడతామని అనుకుంటున్నారా?' అనే ప్రశ్నకు గోపీచంద్ స్పందిస్తూ 'నమ్మకం లేకపోతే జీవితంలో ముందడుగు వేయలేము' అంటూ సమాధానం చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ 'భీమా మూవీ గురించి మాట్లాడుకుంటే.. నేను దానిని నమ్మాను. కానీ అందులో ఒక చిన్న ఎపిసోడ్ తేడా కొట్టిందని మాకు తెలుసు. మిగతాది బాగున్నప్పటికీ అది వర్కౌట్ కాకుండా ఈ ఒక్క ఎపిసోడ్ సినిమాను ఓవర్ షాడో చేసింది' అని చెప్పుకొచ్చారు. 'అయితే రిజల్ట్ మీకు ముందే తెలుసా ?' అని ప్రశ్నించగా.. 'ఆ బ్లాక్ బాగాలేదనే విషయం మాకు ముందే తెలుస' అన్నారు. ఇక 'రామబాణం' మూవీ రిజల్ట్ కూడా మీకు ముందే తెలుసు కదా? అని అడగ్గా... 'అది ముందే తెలిసింది. కానీ ఏమీ చేయలేం.. అయిపోయింది అది అంతే' అంటూ గతంలో తన సినిమాల విషయంలో జరిగిన మిస్టేక్స్ ని గుర్తు చేసుకున్నారు. 


ఆ హీరోకి మాత్రమే విలన్ గా... 
ఇక ఇదే ఇంటర్వ్యూలో మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నట్టుగా మరోసారి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటారా ? అన్న ప్రశ్నకి గోపీచంద్ 'తప్పకుండా షేర్ చేసుకుంటాను' అని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న హీరోలలో ప్రభాస్ కి మాత్రమే తాను విలన్ గా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు గోపీచంద్. గతంలో గోపీచంద్.  ప్రభాస్ కాంబినేషన్లో 'వర్షం' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. మరి మరోసారి వీరిద్దరి కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందో చూడాలి.