Anupama  Eagle Movie Funny Promotions: ‘టైగర్ నాగేశ్వర్ రావు’తో పెద్ద డిజాస్టర్ అందుకున్న రవితేజ ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో కలిసి చేస్తున్న ‘ఈగల్’ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో కావ్య థాపర్ కనిపించబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది.


‘ఈగల్’ ఫన్నీ ప్రమోషన్స్ లో అనుపమ


‘ఈగల్’ ప్రమోషన్ కోసం ఏకంగా హీరోయిన్ అనుపమను రంగంలోకి దింపింది మూవీ యూనిట్. ఆమెతో ఫన్నీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ సిరీస్ ను మొదలు పెట్టింది. అందులో భాగంగా విడుదలైన ఓ వీడియోలో తన సినిమాతో పాటు సోషల్ మీడియా ప్రమోషన్ ను ఎలా చేయాలో వివరిస్తూ పీఆర్ కు క్లాస్ తీసుకుంది. ‘పొగ ఈగల్ ప్రచార సెగ’ పేరుతో విడుదలైన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. వీడియో ప్రారంభం కానగానే, అనుపమ నడుచుకుంటూ పీఆర్ ఛారంబర్ కు వెళ్తుంది. “పీఆర్ పొగ అంటే నువ్వేనా? అని అడుగుతుంది. అతడు నేనే మేడం అని చెప్తాడు. నేనే మీ దగ్గరికి రావాలి.. మీరు నా దగ్గరికి వచ్చారు ఏంటి మేడం? అంటాడు. ప్రమోషన్ కు ఏం ప్లాన్ చేశావ్? ఎట్ల తీసుకొస్తావ్ అటెన్షన్? ఎట్ల పెంచుతున్నావ్ అట్రాక్షన్? బజ్ జెనరేటింగ్ ఐడియాలు ఏంటి? అని ప్రశ్నల మీద ప్రశ్నలు చేస్తుంది. ముఖంలో ఓ ఐడియా లేదు. ప్లానింగ్ లేదు. యూజ్ లెస్. పేరు పక్కన ఉన్న పీఆర్ తీసెయ్ అని వార్నింగ్ ఇస్తుంది. 24 గంటల్లో తన ఇన్ స్టా వీడియో వ్యూస్ డబుల్ కావాలి అంటుంది. అంతేకాదు, దానికి ఏం చేయాలో కూడా చెప్తుంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.



‘ఈగల్’తో రవితేజ మళ్లీ హిట్ కొట్టేనా?


ఇక ‘ఈగల్’ సినిమాలో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డవ్‌జాండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాతో రవితేజ మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. అటు రవితేజ రీసెంట్ మూవీ  ‘టైగర్ నాగేశ్వర్ రావు’ భారీ అంచనాల నడుమ విడుదలైనా, బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయింది. తొలి షో నుంచే ప్రేక్షకులలో నెగెటివ్ టాక్ మొదలయ్యింది. దీంతో సుమారు పాటు అరగంట నిడివి తగ్గించారు మేకర్స్. అయినా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాలేదు. అటు అనుపమ సిద్ధు జొన్నల గడ్డతో కలిసి ‘డీజే టిట్లు’ సీక్వెల్ మూవీ ‘డీజే టిట్లు స్క్వైర్’లో నటిస్తోంది.        


Read Also: అలాంటి సినిమాలు చెయ్యను - ‘యానిమల్’పై తాప్సీ కామెంట్స్, రష్మికాను టార్గెట్ చేసుకుందా?