మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ పతాకంపై  వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో మొదలు కానుందని సమాచారం. 


నవంబర్ నుంచి షూటింగ్...
ఆరు నెలల తర్వాత నుంచి!
Chiranjeevi New Movie Update : చిరంజీవి, వశిష్ఠ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగులో జరుగుతోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆరు నెలలు చిత్రీకరణ జరుగుతుందట. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు... ఆరు నెలలు షూటింగ్ చేసి. ఆ తర్వాత ఆరు నెలలు సీజీ వర్క్ కోసం కేటాయించాలని ముందుగా డిసైడ్ అయ్యారట. 


Also Read : నెక్ట్స్ మూవీ టార్గెట్ రూ. 3 వేల కోట్లు- అట్లీ సంచలన స్టేట్మెంట్, ఆటాడుకుంటున్న నెటిజన్లు


చిరంజీవి 157వ చిత్రమిది. ఆయన సినీ ప్రయాణంలో ఇది భారీ బడ్జెట్ సినిమా అవుతుందని చెబుతున్నారు. ఇందులో ముగ్గురు కథానాయికలకు చోటు ఉందని సమాచారం. అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. అయితే... చిత్ర బృందం అధికారికంగా ఏమీ అనౌన్స్ చేయలేదు. అనుష్కను కన్ఫర్మ్ చేసినట్లు టాక్.


Also Read : రజనీకాంత్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్ - ఐమ్యాక్స్ కెమెరాలో...



సోషియో ఫాంటసీ అండ్ చిరంజీవి!
సోషియో ఫాంటసీ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమాల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తప్పకుండా ఉంటుంది. చిరంజీవి కెరీర్ మొత్తంలో టాప్ 10 ఫిలిమ్స్ తీస్తే... ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. దాని తర్వాత 'అంజి' అని మరో సోషియో ఫాంటసీ సినిమా చేశారు మెగాస్టార్. కొంత విరామం తర్వాత మళ్ళీ ఆ జానర్ సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకుడిగా పరిచయం అయిన 'బింబిసార' కూడా సోషియో ఫాంటసీ చిత్రమే. అందువల్ల, ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది.  
  
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల విడుదల చేశారు. అది చూస్తే... భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం - పంచ భూతాలు ఉన్నాయి. నక్షత్ర ఆకారపు ఎలిమెంట్, త్రిశూలంతో ఆవరించి ఉన్నాయి. పంచ భూతాలతో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు? అనేది ఆసక్తికరం. ప్రేక్షకుల ఊహలకు అతీతంగా కథ, కథనాలు ఉంటాయని తెలిసింది.  


వశిష్ఠ సినిమా కాకుండా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలతో చిరంజీవి ఇంకో సినిమా చేయనున్నారు. ఆ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  చిరు పెద్ద కుమార్తె సుష్మిత నిర్మిస్తారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయట. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial