ఇండియా మంగళవారం (ఆగష్టు15) 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతోంది. ఆంగ్లేయుల దుర్మార్గపు పాలన నుంచి బయటపడిన చారిత్రాత్మక రోజును భారతీయులంతా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.  ఎర్రకోట మొదలుకొని.. మారుమూల పల్లె వరకు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడనున్నాయి. ఇండిపెండెన్స్ డేకు యావత్ భారతం ముస్తాబయ్యింది.


బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ ను గుర్తు చేసుకున్న అనసూయ


ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ భద్వాజ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన మహనీయురాలు, అలనాటి నటి బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ను గుర్తు చేసుకుంది. అచ్చం బేగంలాగే ముస్తాబైన ఉన్న ఫోటోలను నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. “ 1857 కాలం నాటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలు, ఆవాధీ క్వీన్ బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ను గుర్తు చేసుకుంటూ ఆమెకు  నివాళులు అర్పిస్తున్నాను. దేశం కోసం ఆమె ఎంతో పోరాటం చేశారు. తన పోరాటానికి గుర్తుగా  1984 మే 10న ఆమె ఫొటోతో ప్ర‌భుత్వం పోస్టల్ స్టాంప్‌ను రిలీజ్ చేసింది. ఈ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌ర్చిపోయిన పోరాట యోధురాలిని గుర్తు చేసుకుందాం” అంటూ ట్వీట్ చేసింది.  






ఎవరీ బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌?


బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌ అలనాటి అందాల తార. ఎన్నో చిత్రాల్లో తన అద్భుత అభినయంతో అందరినీ అలరించింది. ఆ తర్వాత 1857లో దేశం కోసం సంగ్రామం మొదలయ్యింది. సిపాయిల తిరుగుబాటు షురూ అయ్యింది. సినిమా తారగా ఉన్న బేగం హ‌జ్ర‌త్ మ‌హ‌ల్‌  మాతృదేశ విముక్తి పోరాటంలో అడుగు పెట్టింది. తొలి విడుత స్వాతంత్ర్య సంగ్రామంలో తన వంతు భాగస్వామ్యాన్ని అందించింది. భారతదేశపు తొలి మహిళా స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరిగా ఉద్భవించింది. సినిమాలను వదిలేసి బ్రిటీష్ పాలను వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఎన్నో నిర్భందాలను ఎదుర్కొంది. స్వాతంత్ర్య సమరం తర్వాత స్వతంత్ర భారతం ఆమె గొప్ప పోరాటాన్ని గుర్తించింది. మే 10, 1984న భారత ప్రభుత్వం ఆమె ఫోటోతో పోస్టల్ స్టాంపును విడుదల చేసి, ఆమె పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది. “స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ధైర్యం, నిబద్ధతతో మనకు స్ఫూర్తినిచ్చే బేగం హజ్రత్ మహల్ లాంటి  మరచిపోయిన వీరులను స్మరించుకుందాం” అంటూ అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.   


వరుస సినిమాలతో అనసూయ బిజీ బిజీ


ఇక అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప2’లో కీలక పాత్ర పోషిస్తోంది. తొలి భాగంలో దాక్షాయణిగా ఆకట్టుకున్న అనసూయ, రెండో భాగంలో మరింత కీలకంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె రీసెంట్ గా నటించిన ‘విమానం’ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తోంది.


Read Also: మెగా ఫ్యాన్స్ ఇది చూశారా? ఇక బుల్లితెరపైనా ఆ జర్నలిస్ట్ రచ్చ, చిరు పాటతో ఎంట్రీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial