ముంబై మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసుకు వెళ్లాలంటే ఎన్నో తంటాలు పడాలి. ఇక అప్పుడప్పుడు అక్కడి సెలబ్రిటీలకు కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంటి నుంచి షూటింగ్ స్పాట్ కు చేరుకునేందుకు సినీ ప్రముఖులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా ఇలాంటి సమస్యే మన బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కి ఎదురైంది.


తాజాగా ముంబై ట్రాఫిక్ లో చిక్కుకున్న అమితాబచ్చన్ కి బైక్ మీద వెళ్లే ఓ సాధారణ వ్యక్తి సహాయం చేశారు. అమితాబచ్చన్ ని ఏకంగా బైక్ మీద షూటింగ్ స్పాట్ వద్దకు తీసుకెళ్లాడు. దాంతో సరైన సమయానికి అమితాబచ్చన్ షూటింగ్ కి హాజరయ్యారు. ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ వ్యక్తికి థాంక్స్ చెప్పారు అమితాబచ్చన్. 'నన్ను బైక్ మీద తీసుకెళ్లినందుకు చాలా థాంక్స్ అని పోస్ట్,  చేస్తూ తనను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో తెలియదని,  బైక్ పై తనను వేగంగా తీసుకెళ్లడంతో సరైన సమయానికి షూటింగ్ కి చేరుకున్న అని తెలిపారు.  


ఇక లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి పేరు తెలియకపోవడంతో సోషల్ మీడియాలో అమితాబచ్చన్.. 'క్యాప్,  షార్ట్,  ఎల్లో టీ షర్ట్ వేసుకున్న మీకు చాలా థ్యాంక్స్'  అని చెప్పారు. సోషల్ మీడియాలో అమితాబచ్చన్ పెట్టిన ఈ పోస్టు వైరల్ గా మారుతోంది. ఈ పోస్టు తో పాటు అమితాబచ్చన్ బైక్ పై వెళ్తున్న ఫోటో కూడా నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది.  అమితాబచ్చన్ పెట్టిన ఈ పోస్టుకు ఆయన మనవరాలు సైతం స్పందిస్తూ హార్ట్ ఎమోజిని షేర్ చేసింది.  ఇక అమితాబచ్చన్ తన బ్లాగ్ లో పేర్కొంటూ.. ‘‘మేము చేసే పనికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అనుమతులు ఇస్తారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కారణంగా షూటింగ్ కి వెళ్లలేకపోయాను.  చాలా సంవత్సరాల తర్వాత బైక్ పై ప్రయాణించడం, డ్రైవింగ్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ రైడ్ ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ రాస్కొచ్చారు.






అమితాబచ్చన్ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.  ఒక నెటిజన్ ఏమో.. ‘‘లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి చాలా లక్కీ' అని కామెంట్ చేయగా..  మరో నెటిజన్.. మీరు నిజంగా మెగాస్టార్’’ అంటూ కామెంట్ చేశారు. ఇక అమితాబచ్చన్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఇటీవల 'గుడ్ బై' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మన నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా నటించింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న'ప్రాజెక్ట్ కే' సినిమాలో అమితాబచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నారు.


ఇటీవల ఈ సినిమా షూటింగ్లో అమితాబచ్చన్ గాయపడ్డ విషయం తెలిసిందే. షూటింగ్లో గాయమవడంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోగా.. తాజాగా మళ్లీ షూటింగ్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు హిందీలో అమితాబచ్చన్ 'సెక్షన్ 84' అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రిబూ దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.


Read Also: ఎన్టీఆర్, కొరటాల శివ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్! జూనియర్ బర్త్ రోజున రివీల్?